
‘అపూర్వ’ సమ్మేళనం
32 ఏళ్ల తర్వాత కలుసుకున్న
చించల్పేట్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు
వికారాబాద్: ఆత్మీయం.. అపురూపం అన్నట్టుగా మారింది.. ఆ సమ్మేళనం..32 వసంతాల సుదీర్ఘ కాలం తరువాత కలిసిన ఆ పూర్వ విద్యార్థులు నాటి జ్ఞాపకాలు నెమరేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యేలా చేశాయి. నవాబుపేట మండలం చించల్పేట్ జెడ్పీహెచ్ఎస్లో 1992–93లో పదో తరగతి చదవిన విద్యార్థులు ఆదివారం వికారాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమంలో కలిశారు. నాడు వారికి విద్యా బుద్దులు నేర్పిన ఉపాధ్యాయులు రామకృష్ణారెడ్డి, విష్ణుచిత్తం, సత్యనారాయణరెడ్డి, గోవర్ధన్, యూసెఫ్లతో పాటు ప్రస్తుతం ఆ పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాడు పాండును ఘనంగా సన్మానించారు.
పాతికేళ్ల అనంతరం..
బొంరాస్పేట: పదో తరగతి వరకు ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు పాతికేళ్ల తర్వాత ఆదివారం కలుసుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ గురువులకు పాదిభివందనాలు చేసి తరించారు. 1997–98లో మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన 56మంది పూర్వ విద్యార్థులు ఆత్మీయతను పంచుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన వెంకట్రాములుగౌడ్, నర్సప్ప, చెన్నబసప్ప, సాయన్నగౌడ్, సాయిబన్న, చంద్రశేఖర్గౌడ్లను శాలువాలతో సన్మానించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ హరిలాల్ పాల్గొన్నారు.

‘అపూర్వ’ సమ్మేళనం