
పార్టీ పటిష్టతకు కృషి చేయాలి
ఇబ్రహీంపట్నం: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ పటిష్టతకు కృషి చేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజు భూపాల్గౌడ్ పిలుపునిచ్చారు. పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం.. ఆ పార్టీ భవనగిరి పార్లమెంట్ కో కన్వీనర్ నారాయణయాదవ్ అధ్యక్షతన స్థానిక వైష్ణవిగార్డెన్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రానున్న స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్