పార్టీ పటిష్టతకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

పార్టీ పటిష్టతకు కృషి చేయాలి

Jun 16 2025 7:19 AM | Updated on Jun 16 2025 7:19 AM

పార్టీ పటిష్టతకు కృషి చేయాలి

పార్టీ పటిష్టతకు కృషి చేయాలి

ఇబ్రహీంపట్నం: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ పటిష్టతకు కృషి చేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజు భూపాల్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం.. ఆ పార్టీ భవనగిరి పార్లమెంట్‌ కో కన్వీనర్‌ నారాయణయాదవ్‌ అధ్యక్షతన స్థానిక వైష్ణవిగార్డెన్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రానున్న స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.

మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement