స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి

May 29 2025 10:04 AM | Updated on May 29 2025 10:04 AM

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి

తాండూరు రూరల్‌: గ్రామస్థాయి నుంచి పార్టీ పటిష్టతకు కృషి చేద్దామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చంద్రవంచ, మిట్టబాసుపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్‌ కార్యకర్తలు బుధవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. చంద్రవంచ గ్రామానికి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ మంజూరైనా పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. హనుమాన్‌ ఆలయ చైర్మన్‌ పదవి ఖాళీగా ఉందని.. భర్తీ చేయాలని కోరారు. స్థానిక ఎన్నికల తర్వాత చైర్మన్‌ పదవిని భర్తీ చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. మిట్టబాసుపల్లిలో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయని.. మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఆ గ్రామ నాయకులు ఎమ్మెల్యేను కోరారు. అలాగే మసీదు నిర్మాణానికి సహకరించాలని విన్నవించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు విజయ్‌కుమార్‌, అంజిలప్ప, అనంతప్ప, నర్సింలు, ఎల్లప్ప, జగదీష్‌, మల్లప్ప, ఇస్మాయిల్‌, పెద్ద ఇస్మాయిల్‌, గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement