లక్కీడ్రా విజేతలకు బహుమతులు అందజేత | - | Sakshi
Sakshi News home page

లక్కీడ్రా విజేతలకు బహుమతులు అందజేత

Apr 15 2025 7:18 AM | Updated on Apr 15 2025 7:18 AM

లక్కీ

లక్కీడ్రా విజేతలకు బహుమతులు అందజేత

తాండూరు టౌన్‌: హనుమాన్‌ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో విజేతలకు హనుమాన్‌ జన్మోత్సవ సమితి ఆధ్వర్యంలో సోమవారం బహుమతులు అందజేశారు. హనుమాన్‌ శోభాయాత్ర సందర్భంగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. మొదటి బహుమతిగా హోండా యూనికాన్‌ బైక్‌ను విజేత గుముడాల సుధాకర్‌ (నం.9253), ద్వితీయ బహుమతిగా హోండా యాక్టీవాను విష్ణురాంజీకి (నం.6981) స్థానిక స్టేషన్‌ హనుమాన్‌ ఆలయ చైర్మన్‌ మిస్కిన్‌ శంకర్‌, నరహరి అందజేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్‌ జన్మోత్సవ సమితి సభ్యులు రజినీకాంత్‌, మహేష్‌ ఠాకూర్‌, రామకృష్ణ, పునీత్‌, భవానీ సింగ్‌, గురురాజ్‌, శ్రీనివాస్‌, ఆనంద్‌, శివ, అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

తాండూరు రూరల్‌: మండల పరిధిలోని సంగెంకలాన్‌ గ్రామానికి చెందిన ఎల్మకన్నె పీఏసీఏస్‌ మాజీ చైర్మన్‌ సంగెం నారాయణగౌడ్‌ సతీమణి ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి సోమవారం నారాయణగౌడ్‌ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంగెం కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, వ్యాపారులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆమె మృతదేహానికి నివాళి అర్పించారు. అంతియ యాత్రలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రవిగౌడ్‌, మాజీ సర్పంచ్‌ మేఘనాథ్‌గౌడ్‌, నాయకులు రవీందర్‌, కేశవరావు, పండరి, సాయిలు, బోయ రాజు, హమీద్‌ మియా, శ్యామప్ప ,శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.

భక్తి శ్రద్ధలతో దర్గా ఉత్సవాలు

నవాబుపేట: మండల పరిధిలోని ఎక్‌మామిడి గ్రామంలో రెండు రోజులుగా జరుగుతున్న సాహెబ్‌ హుస్సేన్‌ దర్గా ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతన్నాయి. ఈ ఉత్సవాలకు సోమవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మల్లారెడ్డి, మాజీ సర్పంచ్‌ ఎండీ రశీ, నాయకులు యాదవరెడ్డి, పాపిరెడ్డి, దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.

చలివేంద్రం ప్రారంభోత్సవం

పూడూరు: ప్రతీ ఒక్కరు సేవాభావాన్ని అలవర్చుకోవాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన కెరవెళ్లి గేటువద్ద కాంగ్రెస్‌ నాయకుడు అలీ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసీసీ ఉపాధ్యక్షుడు ఆనందం, రఘునాథ్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి, కార్యదర్శి పెంటయ్య, నాయకులు మోహిన్‌పాషా, కరీం తదితరులు పాల్గొన్నారు.

లక్కీడ్రా విజేతలకు బహుమతులు అందజేత 1
1/3

లక్కీడ్రా విజేతలకు బహుమతులు అందజేత

లక్కీడ్రా విజేతలకు బహుమతులు అందజేత 2
2/3

లక్కీడ్రా విజేతలకు బహుమతులు అందజేత

లక్కీడ్రా విజేతలకు బహుమతులు అందజేత 3
3/3

లక్కీడ్రా విజేతలకు బహుమతులు అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement