ప్రస్తుతం ప్రజారవాణా వ్యవస్థ ఆటోవాలా చేతిలోకి చేరింది.. రవాణాశాఖాధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు.. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించడం..ప్రజా అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపకపోవడం ఆటోవాలాలకు వరంగా మారింది. ఆర్టీఏ, ఆర్టీసీ, పోలీసు శాఖలు వైఫల్యం చెందడంతో ఆటోల హవా కొనసాగుతోంది. ఆటోలో ప్రయాణంతో జీవితం ఎటు పోతుందో తెలిసినా.. తప్పని సరి పరిస్థితిలో జనం తమ ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటన గురువారం తిరుపతి నగరంలో చోటు చేసుకోగా సాక్షి తన కెమెరాలో బంధించింది. – సాక్షి ఫోటోగ్రాఫర్ తిరుపతి


