కండలేరు జలాశయాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ!
రాపూరు: మండలంలోని కండలేరు జలాశయాన్ని బుధవారం నిపుణుల కమిటీ బృందం పరిశీలించింది. కండలేరు జలాశయంలోని ప్రస్తుత మున్న నీటి నిల్వలు, నీటి విడుదల గురించి ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలాశయంలో 60 టీఎంసీ నీరు నిల్వ ఉండడంతో ఎటువంటి సమస్యలు తలెత్తే పరిస్థితి ఉందన్న అంశంపై ఇంజినీరింగ్ బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జలాశయంలోని హైలెవల్, లోలెవల్ స్లూయీస్ను, హెడ్రెగ్యులేటర్ను బృందం పరిశీలించింది. హెడ్రెగ్యులేటర్ వద్ద ఉన్న గేట్లు చాలా కాలంగా ప్రజర్ ఇస్తేనే గేట్లు పైకి లేస్తున్నట్లు సిబ్బంది తెలిపినట్లు నిపుణుల కమిటీ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం గేట్లు పరిస్థితిని పరిశీలించామని, నీరు ఎక్కువగా వస్తుండడంతో గేట్లు పరిస్థితి తెలియడంలేదని, నీరు తగ్గిన తరువాత మరోసారి పరిశీలించి గేట్లు ఎందుకు స్ట్రక్ అవుతున్నాయన్న విషయం తెలుసుకుంటామని అప్పుడు గేట్లు మార్చాలా? లేదా ఏదైనా మరమ్మతులు చేపట్టాలా, లేదా కొత్త గేట్లు పెట్టాలని చెప్పగలమన్నారు. ఈ నిపుణుల కమిటీ బృందంలో తిరుపతి క్యాలిటీ కంట్రోల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ శారద, నెల్లూరు తెలుగుగంగ ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజినీరు సుబ్రమణేశ్వరావు, ఈఈ గజేంద్రరెడ్డి, డీఈ నాగేంద్రబాబు, ఏఈ అనిల్ ఉన్నారు.


