
గ్రీవెన్స్కు నోడల్ అధికారులు
● పీజీఆర్ఎస్లో పలు మార్పులకు శ్రీకారం
● రాష్ట్ర భూ పరిపాలన చీఫ్
కమిషనర్ జయలక్ష్మి సమీక్ష
తిరుపతి అర్బన్:పీజీఆర్ఎస్ (ప్రజా సమస్య ల పరిష్కార వేదిక)కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని...అయితే ఆ స్థాయిలో అర్జీలు పరిష్కారం అయ్యేలా అధికారులు చూడాలని అందుకు మండల స్థాయిలో నోడల్ అధికారిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర భూ పరిపాలన చీఫ్ కమిషనర్ జి. జయలక్ష్మి వెల్లడించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఆమె గురువారం కలెక్టర్ వెంకటేశ్వర్తో కలసి మండల, డివిజన్, జిల్లా రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. ప్రతి సోమవారం మండల కేంద్రంలో తహసీల్దార్ గ్రీవెన్స్ నిర్వహించాలని, శని వారం కోర్టు కేసులు పరిష్కారం పనిచేయాలని, మంగళవారం నుంచి శుక్రవారం వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్లో మార్పులు చేయనున్నామని రెండు రోజుల్లో స్పష్టంగా తెలియజేస్తామని పేర్కొన్నారు. మండల స్థాయిలో సోమవారం మధ్యాహ్నం వరకు గ్రీవెన్స్ నిర్వహించాలని.. మధ్యాహ్నం తర్వాత తహసీల్దా ర్ నేతృత్వంలో రెవెన్యూ సిబ్బందితో కూర్చుని ఆ రోజు వచ్చిన అర్జీలు పై వారంలోపు నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి సోమవా రం జరిగే సమావేశానికి సంబంధించిన మిని ట్స్ రికార్డ్ చేసుకుని ఉంచుకోవాలని, వాటి వివరాలను ఆర్డీఓకు పంపాలన్నారు. మ్యుటేషన్లకు సంబంధించిన ప్రక్రియ, కుల ధ్రువీకరణ జారీ అంశాల్లో తప్పిదాలకు తావివ్వరాదన్నారు. వెబ్ ల్యాండ్ సంబంధించి ఏ ఎంట్రీ అయినా తహసీల్దార్ పరిశీలించాలన్నారు. ఆగస్టు 15 లోపు పట్టాలు ఇచ్చేలా జిల్లాలోని 34 మండలాల్లో కనీసం 10 నుంచి 16 మండలాల్లో కొన్ని గ్రామాల్లోనైనా ఈ ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. పోలీస్శాఖ వారికి 70 శాతం భూ సమస్యలతో వచ్చే వివాదాలతోనే సరిపోతుందని...దాంతో శాంతి భద్రతలు తలెత్తే ప్రమాదం ఉందని గుర్తుచేశారు.
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాం
దీర్ఘకాలంగా ఉన్న పలు సమస్యలను పరిష్కరించామని కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు. రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేయడం జిల్లాలో లేదని తెలిపారు. శాంతి భద్రత సమ స్యలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఆర్ఓ నరసింహులు, తిరుపతి,శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీవోలు బి రామమోహన్, భాను ప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ్ కుమార్, కలెక్టరేట్ లోని వివిధ విభాగాలకు చెందిన సెక్షన్ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు,జిల్లాలోని తహసీల్దారులు, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.