నూతన ఆవిష్కరణలపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

నూతన ఆవిష్కరణలపై దృష్టి

Jun 24 2025 4:17 AM | Updated on Jun 24 2025 4:17 AM

నూతన

నూతన ఆవిష్కరణలపై దృష్టి

తిరుపతిలో కదంతొక్కిన యువత
● వైఎస్సార్‌సీపీ యువజన.. విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ● ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం.. కలెక్టరేట్‌ వద్ద ఆందోళన ● ఉద్యోగాల కల్పన.. నిరుద్యోగ భృతిపై గళమెత్తి నిరసన ● హామీలను తుంగలో తొక్కడంపై మండిపాటు

అధికారం కోసం వంచించారు

ఎన్నికల సమయంలో ఎలా గైనా అధికారంలోకి రావాలనే దురుద్దేశంతోనే చంద్రబాబు అబద్ధపు హామీలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత యువతను వంచించారు. ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని దగా చేశారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఇద్దరూ దోషులే. యువత తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. ఈ విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకుంటే సహించే ప్రసక్తే లేదు. లోకేష్‌కు మంత్రి పదవి కట్టబెట్టడంలో చూపిన శ్రద్ధలో పావు వంతు యువత భవిష్యత్‌పై చూపితే లక్షలాది మందికి మేలు చేయవచ్చు. కానీ, చంద్రబాబుకు అధికారమే పరమావధి. ప్రజా సంక్షేమం ఇసుమంత కూడా పట్టదు. – ఉదయ్‌వంశీ,

వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు

నగరంలో భారీ ర్యాలీ

యువత పోరులో భాగంగా తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌వంశీ, నగర అధ్యక్షుడు దినేష్‌రాయల్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి జెండా ఊపి బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. అయితే అడుగడుగునా పోలీసులు ర్యాలీని అడ్డుకునేందుకు యత్నించారు. యువతను చెదరగొట్టేందుకు లాఠీలను ఝళిపించారు. తిరుచానూరుకు వెళ్లే మార్గంలోని ప్లైఓవర్‌ కిందే భైక్‌లు పెట్టేసి నడిచివెళ్లాలంటూ ఆంక్షలు విధించారు. అయినప్పటికీ యువత కదంతొక్కింది. భారీ సంఖ్యలో కలెక్టరేట్‌ వద్దకు చేరుకుని యువతపోరును విజయవంతం చేసింది.

తిరుపతి మంగళం : ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం నోటికి వచ్చిన అబద్ధపు హామీలు గుప్పించి మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో సోమవారం తిరుపతిలో ‘యువతపోరు’ పేరుతో కదంతొక్కింది. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌వంశీ, తిరుపతి నగర అధ్యక్షుడు దినేష్‌రాయల్‌, విద్యార్థి విభాగం నేతలు ఓబుల్‌రెడ్డి, చెంగల్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో యువతీయువకులు, విద్యార్థులు తరలివచ్చి యువతపోరులో పాల్గొన్నారు. కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ హామీలు అమలు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం కోసం వెన్నుపోటు పొడుస్తారా అంటూ మండిపడ్డారు. ఇచ్చిన మాట నెరవేర్చకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్‌ వద్ద సుమారు రెండు గంటల పాటు శాంతియుతంగా నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్‌లోకి వెళ్లి డీఆర్‌ఓ నరసింహులకు వినతిపత్రం అందించారు. వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, ఓబుల్‌రెడ్డి, ఇమ్రాన్‌బాషా, అనిల్‌రెడ్డి, కార్పొరేటర్‌ ఆరణి సంధ్య, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షులు గీతాయాదవ్‌, గ్రీవెన్స్‌ సెల్‌ నగర అధ్యక్షుడు మద్దాలి శేఖర్‌, నగర బూత్‌ కమిటీ ఇన్‌చార్జి సాయికుమారి, మల్లం రవికుమార్‌రెడ్డి, సురేష్‌, చెంగల్‌రెడ్డి మాట్లాడుతూ యువతకు, విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

జీవితాలతో చెలగాటం

ఉన్నత విద్యను అభ్యసించి బంగారు భవిత కోసం తపించే విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ చెల్లించకుండా జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారు. కళాశాలలకు సకాలంలో ఫీజు రీయింబర్స్‌ చేయకపోవడంతో విద్యార్థులను కాలేజీల్లోకి రానివ్వడం లేదు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం యువతను బలిపెడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. లేకుంటే మరింత ఉధృతంగా ఉద్యమిస్తాం.

– ఓబుల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర నేత

నూతన ఆవిష్కరణలపై దృష్టి 1
1/5

నూతన ఆవిష్కరణలపై దృష్టి

నూతన ఆవిష్కరణలపై దృష్టి 2
2/5

నూతన ఆవిష్కరణలపై దృష్టి

నూతన ఆవిష్కరణలపై దృష్టి 3
3/5

నూతన ఆవిష్కరణలపై దృష్టి

నూతన ఆవిష్కరణలపై దృష్టి 4
4/5

నూతన ఆవిష్కరణలపై దృష్టి

నూతన ఆవిష్కరణలపై దృష్టి 5
5/5

నూతన ఆవిష్కరణలపై దృష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement