
● బాండ్లు పంచిన జేమ్స్బాండ్లు ఎక్కడ ? ● యువతకు న్యాయం
నగరి : ఉద్యోగాలు కల్పిస్తాం, డీఎస్సీ నిర్వహిస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, రూ.10 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలిస్తాం అంటూ కూటమి ప్రభుత్వం మాయమాటలు చెప్పి యువతను మోసం చేసిందని, జాబ్ గ్యారెంటీ అనుకున్న వారికి వెన్నుపోటు పొడిచిందని మాజీ మంత్రి ఆర్కే రోజా ఽవిమర్శించారు. సోమవారం నగరి నియోజకవర్గం నుంచి తిరుపతి కలెక్టరేట్కు బయలుదేరిన బైక్ ర్యాలీని వడమాటపేట వద్ద జెండా ఊపి ప్రారంభించారు. రోజా మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో యువత ఆగ్రహావేశాలకు లోనయ్యారన్నారు. ప్రతి నియోజకవర్గంలో 500 మంది నిరుద్యోగులకు 10 లక్షల స్వయం ఉపాధి రుణాలిస్తామన్న హామీ కూడా నెరవేరలేదన్నారు. హైదరాబాద్లో ఉన్న చంద్రబాబుకు సీఎం పోస్టు, పవన్కళ్యాణ్కు డిప్యూటీ సీఎం, లోకేష్కు మంత్రి, నాగబాబుకు ఎమ్మెల్సీ పోస్టులు వచ్చాయని ఎద్దేవా చేశారు.
బాండ్లు ఇచ్చి ఎగ్గొట్టారు
ఎన్నికల ముందు ఇంటింటికీ వెళ్లి బాండ్లు పంచిన జేమ్స్బాండ్లు నేడు ఎక్కడికెళ్లారని ఆర్కే రోజా ప్రశ్నించారు. పవర్ స్టార్ పవర్ వచ్చాక ఫ్లవర్లా మారిపోయారన్నారు. గబ్బర్ సింగ్లాగా డైలాగు లు చెప్పిన ఆయన రబ్బర్లాగా మెలికలు తిరుగుతున్నాడన్నారు. నేడు నిరుద్యోగులు తమకు ఉ ద్యోగం రాలేదు న్యాయం చెయ్యండని అడగడాని కి వెళితే ఆయన సినిమాల్లో బిగాగా ఉన్నాడన్న సమాధానం వస్తోందన్నారు. డిప్యూటీ సీఎం కనబడటం లేదని ఫ్లెక్సీలు పెట్టే పరిస్థితి వచ్చిందన్నా రు. చంద్రబాబుకు, పవన్కు, లోకేష్కు స్పెషల్ ఫ్లై ట్లు, స్పెషల్ హెలికాప్టర్లుకు ఉన్న డబ్బు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి లేదా అని ప్రశ్నించారు. ని రుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే వరకు, 13 నెల ల భృతి ఇచ్చేంతవరకు వారికి అండగా నిల బడి పోరాడుతామన్నారు. నియోజవర్గ యువత విభా గం నాయకులు, పార్టీ నాయకులు, కమిటీ లు, అనుబంధ కమిటీల నాయకులు పాల్గొన్నారు.