మృత్యంజయస్వామికి ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

మృత్యంజయస్వామికి ప్రత్యేక పూజలు

Jun 24 2025 4:17 AM | Updated on Jun 24 2025 4:17 AM

మృత్య

మృత్యంజయస్వామికి ప్రత్యేక పూజలు

శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మృత్యుంజయస్వామివారికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గణపతిపూజ, కలశ స్థాపన చేశారు. అనంతరం స్వామివారిని చందనం, నారికేళం, పసుపు, కుంకుమ, విభూదితో అభిషేకించారు. పెద్దసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

రేపే పీజీ సెట్‌ ఫలితాలు

తిరుపతి సిటీ : ఎస్వీయూ ఆధ్వర్యంలో ఈనెల 9వ నుంచి 12వ తేదీవరకు రాష్ట్ర వ్యాప్తంగా 30 కేంద్రాలలో నిర్వహించిన ఏపీ పీజీ సెట్‌–2025 ఫలితాలు బుధవారం విడుదల చేయనున్నారు. ఈ మేరకు సెట్‌ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 25,688 మంది విద్యార్థులు పలు కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోగా 22 వేలమంది పీజీ సెట్‌కు హాజరయ్యారు.

విద్యార్థినికి అభినందన

తిరుపతి సిటీ : పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో పొలిటికల్‌ సైన్‌న్స్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఎ.ప్రవళ్లిక లాసెట్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయి 279వ ర్యాంకు సాధించింది. సోమవారం ఈ మేరకు విద్యార్థినిని ప్రిన్సిపల్‌ నారాయణమ్మ అభినందించారు. ప్రవళ్లిక మాట్లాడుతూ గ్రూప్‌–1 అధికారిగా రాణించడమే లక్ష్యమని తెలిపింది. కార్యక్రమంలో పొలిటికల్‌ సైన్స్‌ విభాగాధిపతి సాయి కుమారి, అధ్యాపకులు భారతి, విజయ కుమారి పాల్గొన్నారు.

ఎస్వీయూ ‘సింపోసియా’ ప్రారంభం

తిరుపతి సిటీ :ఎస్వీయూ గణాంకశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘‘గణాంకాలు , డేటా సైన్స్‌లో స్థిరమైన అభివృద్ధి’’ అనే అంశంపై వారం రోజుల పాటు నిర్వహించనున్న సింపోసియా సెమినార్‌ సోమవారం ప్రారంభమైంది. రిజిస్ట్రార్‌ భూపతినాయుడు, ఐఐటీ విజిటింగ్‌ ప్రొఫెసర్‌ వీవీరావు ముఖ్యఅతిథులుగా హాజరై సెమినార్‌ను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఆధునిక కాలంలో డేటా సైన్స్‌ ప్రధాన భూమిక పోషిస్తోందని తెలిపారు. డేటాసైన్స్‌లో గణాంకాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. సైన్స్‌ కళాశాల పిన్సిపల్‌ ఆచార్య పద్మావతి, గణాంకశాస్త్ర విభాగాధిపతి ఆచార్య సరోజమ్మ, ఆచార్య వెంకటరమణ రెడ్డి, ఆచార్య జయసుబ్బారెడ్డి, ఆచార్య భారతి, ఆచార్య సుగుణమ్మ, రిటైర్డ్‌ ఆచార్యులు బాలసిద్ధముని, వెంకటరమణయ్య, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఘనంగా ఒలింపిక్‌ రన్‌

తిరుపతి కల్చరల్‌ : అంతర్జాతీయ ఒలింపిక్‌ దినోత్సవం సందర్భంగా సోమవారం తిరుపతిలో ఘనంగా ఒలింపిక్‌ క్రీడా రన్‌ చేపట్టారు. జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శ్రీనివాస స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నుంచి మహతి ఆడిటోరియం వరకు రన్‌ సాగింది. ముఖ్య అతిథులుగా ఉప విద్యాశాఖాధికారి బాలాజీ, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎలమంచిలి ప్రవీణ్‌ , ప్రత్యేక ఆహ్వానితుడిగా డీఎస్‌డీఓ ఎన్‌.శశిధర్‌ హాజరై ఒలింపిక్‌ జ్యోతి వెలిగించి పరుగును ప్రారంభించారు. ఈ క్రమంలో ముందుగా హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఒలింపిక్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌, కోశాధికారి సాయికుమార్‌, ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్‌, ఫుట్‌బాల్‌ సంఘం నేతలు రెడ్డెప్ప, మునెయ్య, కరాటే సంఘం రత్నాకర్‌, రెజ్లింగ్‌ కార్యదర్శి ఉదయ్‌, జన అకాడమీ కిరణ్‌, బాడీ బిల్డింగ్‌ సంఘం ప్రతినిధి బద్రి, డీఎస్సీ కోచ్‌లు గోపి, వినోద్‌, ఇందూజ, ఆది, ప్రేమ్‌నాథ్‌, సాయి, సుమతి, హరి పాల్గొన్నారు.

మృత్యంజయస్వామికి ప్రత్యేక  పూజలు 1
1/3

మృత్యంజయస్వామికి ప్రత్యేక పూజలు

మృత్యంజయస్వామికి ప్రత్యేక  పూజలు 2
2/3

మృత్యంజయస్వామికి ప్రత్యేక పూజలు

మృత్యంజయస్వామికి ప్రత్యేక  పూజలు 3
3/3

మృత్యంజయస్వామికి ప్రత్యేక పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement