
ప్రాణదాన ట్రస్టుకు రూ.40 లక్షల విరాళం
తిరుమల: టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు సోమవారం పలువురు భక్తులు రూ.40 లక్షల విరాళం అందజేశారు. ఇందులో రాజస్థాన్కు చెందిన ఏకే ఇంజినీరింగ్ కంపెనీ ప్రతినిధులు రూ.10,59,000లు, బెంగళూరుకు చెందిన అగర్వాల్ ఇండెక్స్ ఫర్నీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.20 లక్షలు, కోనసీమ జిల్లాకు చెందిన దండుమేను శశాంక్ కృష్ణ రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. వారు డీడీలను తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 87,254 మంది స్వామిని దర్శించుకున్నారు. ారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.28 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టిక్కెట్లు లేని వారికి 24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఈక్రమంలో సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లితే అనుమతించమని స్పష్టం చేసింది.