
ఘనంగా ఒలింపిక్ డే ర్యాలీ
తిరుపతి సిటీ : ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో సోమవారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ డే ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ వేణుగోపాల్రెడ్డి ఒలింపిక్ జ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తమ కళాశాలలో ప్రతి ఏటా జూన్ 23న ఒలింపిక్ డేని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. విద్యార్థు లు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై.మల్లికార్జునరావు, పీడీ డాక్టర్ ముస్తాక్ అహ్మద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.