
తుస్సు.. విద్యుత్ బస్సు
అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2021లో తిరుపతిలో కాలుష్య నియంత్రణలో భాగంగా జిల్లాకు మొట్టమొదటిగా 100 విద్యుత్ బస్సులను మంజూరు చేశారు. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. మరమ్మతుకు గురైతే ఆ సర్వీస్ను పట్టించుకోవడం లేదు. 10 శాతానికి పైగా సర్వీసులు మూలకు పడ్డాయని విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే ఎక్కడ పడితో అక్కడ ఆగిపోతున్నాయి. మంగళవారం తిరుమల బైపాస్ రోడ్డులోని శ్రీనివాసం సమీపంలో ఓ విద్యుత్ సర్వీస్ నడిరోడ్డుపై ఆగిపోయింది.దీంతో బస్సులోని ప్రయాణికులు దిగి బస్సును తోయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆగిపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. –సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి