
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
రాపూరు:పెంచలకోన రహదారిలో సోమవారం వేకువజామున గుర్తుతెలియని వాహన ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. రాపూరుకు చెందిన నగిరి వేణు(48) మోటార్సైకిల్ మెకానిక్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మండలంలోని గోనుపల్లె నుంచి రాపూరుకు బైక్పై వస్తుండగా పెనుబర్తి, ఓబులాయిపల్లె మధ్య ప్రమాదం జరిగింది. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబీకులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.