
టీటీడీకి ఏసీ బస్సు విరాళం
తిరుమల:ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ,అశోక్ లేలాండ్ తిరుమల–తిరుపతి దేవస్థానానికి ఒక 41–సీటర్ ఏసీ బస్సును ఆదివారం విరాళంగా అందజేసింది. సుమారు రూ.35 లక్షల విలువైన ఈ బస్సును అశోక్ లేలాండ్ ఎంఅండ్హెచ్సీవీ అధ్యక్షుడు సంజీవ్ కుమార్ శ్రీవారి ఆలయం ముందు అందజేశారు. సాధారణంగా ప్రతి ఏటా ఈ కంపెనీ యాజమాన్యం టీటీడీకి ఒక వాహనాన్ని విరాళంగా ఇవ్వడం పరిపాటి. ఈ కార్యక్ర మంలో ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, తిరుమల డిపో డీఐ వెంకటాద్రి నాయుడు పాల్గొన్నారు.
ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య
రేణిగుంట: భర్తతో గొడవపడి మనస్థాపంతో ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం వెలుగు చూసింది. గాజులమండ్యం ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని జీపాల్యం హరిజనవాడలో భాస్కర్ తేజోవతి దంపతులు కాపురం ఉంటున్నారు. ఆదివారం ఉదయం భర్తతో జరిగిన చిన్నపాటి గొడవ వల్ల మనస్థాపానికి గురైన తేజోవతి (37) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కి ఉరి వేసుకుంది. స్థానికులు గమనించి హస్పిటల్కు తరలించగా పరీక్షిచిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. గాజులమండ్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. మృతురాలి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.