
● ఆధ్యాత్మిక క్షేత్రంలో మళ్లీ పడగవిప్పిన లిక్కర్ మాఫియ
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో కూటమి నేతల అండదండలతో మద్యం మాఫియా చెలరేగిపోతోంది. నగరంలోని ప్రతి మద్యం దుకాణం ఓ బారును తలపిస్తోంది. నిబంధనలకు విరుద్దంగా రేయింబవళ్లు మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఎంఆర్పీ ధరల కంటే అదనంగా వసూలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అకస్మిక తనిఖీల్లో మద్యం మాఫియా విచ్చలవిడి అమ్మకాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు నెల క్రితం వైఎస్సార్సీపీ తిరుపతి నియోజక వర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి నగరంలో విచ్చలవిడిగా పర్మిట్ రూములు ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు సాగిస్తున్న విషయాలను వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో కొద్ది రోజుల పాటు మద్యం దుకాణాల యజమానులు పర్మిట్ రూముల జోలికి వెళ్లకుండా నిబంధనల మేరకు నడిపారు. తర్వాత యథావిధిగా అమ్మకాలను ప్రారంభించారు. ఈ సారి భూమన కరుణాకరరెడ్డి స్వయంగా పరిశీలించి ఎకై ్సజ్ కమిషనర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తుండంపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మద్యం బ్రాండ్లపై ఎంఆర్పీ కంటే రూ.30 నుంచి రూ.40 అదనంగా వసూలు చేయడాన్ని ప్రత్యక్షంగా చూసి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి నగరంలో మద్యం మాఫియా ఎలా రెచ్చిపోతుందో చూద్దాం రండి..
● సాయంత్రం 4.25 గంటలు : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో శిల్పారామానికి ఎదురుగా పద్మావతి వైన్స్, ఆ పక్కనే ఉన్న ఈడెన్ పార్క్ వైన్స్ వెనుక భాగంలో తాటాకు, కొబ్బరి మట్టలతో బార్లను తలపించేలా ఏర్పాటు చేసి ఉన్న పర్మిట్ రూములను కరుణాకరరెడ్డి పరిశీలించారు. అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులను సైతం మద్యం దుకాణం వద్ద ఏర్పాటు చేసిన సెక్యురిటీతో విజిల్ వేయించి పిలిపిస్తున్నారు. ఆ రెండు వైన్షాపుల వెనుక మందుబాబు కూర్చొని మద్యం తాగేందుకు వీలుగా దిమ్మెలు ఉండడం గమనించారు. ఈ క్రమంలో పలువురు మందుబాబు అక్కడ మద్యం తాగడం కనిపించింది.
● 5.12 గంటలు : ఓల్డ్ మెటర్నటీ ఆస్పత్రి ఎడమ వైపు ఉన్న బడివైన్స్లో నిబందనలకు విరుద్దంగా ప్రత్యేకంగా పర్మిట్ రూము ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. అక్కడే మిద్దైపెన ప్రత్యేకంగా బార్ని తలపించేలా రేకుల షెడ్డు ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు.
● 5.19 గంటలు : అన్నారావు కూడలి వద్ద ఏర్పాటు చేసిన జేకే వైన్స్ వారు కూడా పర్మిట్ రూము ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు.
● సాయంత్రం 5.28 గంటలు : జీవకోన వద్ద ఏర్పాటు చేసిన జీవా వైన్స్ ఎదురుగా, పక్కన బహిరంగ ప్రదేశంలో, మరో వైపు పర్మిట్ రూములో యధేచ్చగా మద్యం ప్రియులను కూర్చోబెట్టి తాగిస్తున్నారు.
● 5.38 గంటలు : లీలామహల్ కూడలి నుంచి కరకంబాడికి వెళ్లే మార్గంలోని ఫ్లై ఓవర్కి అనుకుని ఉన్న ఎస్వీఎస్ వైన్ షాపు యాజమాన్యం కూడా నిబంధనలకు విరుద్దంగా పర్మిట్ రూము ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు సాగిస్తుండడాన్ని భూమన గమనించారు.
● 5.49 గంటలు: సామవాయి మార్గంలోని మామా వైన్స్ యాజమాన్యం కూడా పర్మిట్ రూము ఏర్పాటు చేసి బయట ఎవరికీ కనిపించుకుండా ఉండేందుకు కర్టెన్ ఏర్పాటు చేసి మందుబాబులు కూర్చుని తాగే వెసులుబాటు కల్పించారు.
4.50 గంటలు : టీవీఎస్ షోరూమ్ కూడలి వద్ద ఉన్న విక్టరీ వైన్స్ వెనుక భాగంలో బార్ని తలపించేలా ఏర్పాటు చేసిన పర్మిట్ రూముని భూమన పరిశీలించారు. నిబంధనలకు విరుద్దంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న విషయంపై అధికారులకు ఫిర్యాదు చేశారు.
5.01 గంటలు : రైల్యేస్టేషన్ పక్క సందులో ఏర్పాటు చేసి ఉన్న నైన్ స్టార్ వైన్స్ వద్దకు భూమన చేరుకున్నారు. వైన్ షాపు పరిధిలోనే రేకుల షెడ్డుతో పర్మిట్ రూము ఏర్పాటు చేసి వచ్చిపోయే జనాన్ని పిలిపించి కూర్చొబెట్టి మద్యం తాగించడం గమనించి మండిపడ్డారు.
5.56 గంటలు : తిరుపతి నుంచి తిరుచానూరు వెళ్లే మార్గం పద్మావతిపురం వద్ద రోడ్డుపై ఏర్పాటు చేసి ఉన్న శివ వైన్స్ యాజమాన్యం కూడా నిబందనలకు విరుద్ధంగా పర్మిట్ రూము ఏర్పాటు చేయడం భూమన కరుణాకరరెడ్డి తనిఖీలో వెలుగులోకి వచ్చింది.

● ఆధ్యాత్మిక క్షేత్రంలో మళ్లీ పడగవిప్పిన లిక్కర్ మాఫియ

● ఆధ్యాత్మిక క్షేత్రంలో మళ్లీ పడగవిప్పిన లిక్కర్ మాఫియ

● ఆధ్యాత్మిక క్షేత్రంలో మళ్లీ పడగవిప్పిన లిక్కర్ మాఫియ

● ఆధ్యాత్మిక క్షేత్రంలో మళ్లీ పడగవిప్పిన లిక్కర్ మాఫియ

● ఆధ్యాత్మిక క్షేత్రంలో మళ్లీ పడగవిప్పిన లిక్కర్ మాఫియ

● ఆధ్యాత్మిక క్షేత్రంలో మళ్లీ పడగవిప్పిన లిక్కర్ మాఫియ

● ఆధ్యాత్మిక క్షేత్రంలో మళ్లీ పడగవిప్పిన లిక్కర్ మాఫియ

● ఆధ్యాత్మిక క్షేత్రంలో మళ్లీ పడగవిప్పిన లిక్కర్ మాఫియ

● ఆధ్యాత్మిక క్షేత్రంలో మళ్లీ పడగవిప్పిన లిక్కర్ మాఫియ