
డ్వాక్రా మహిళ ఆత్మహత్య
శ్రీకాళహస్తి: రుణం కట్టలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాళహస్తి రెండవ పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని చెంచులక్ష్మి కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి రెండవ పట్టణ పోలీసుల కథనం.. సుమలత అలియాస్ ఉష(40) డ్వాక్రా గ్రూప్లో సభ్యురాలు. ఈమె అందులో రుణం పొంది కంతులు కడుతుండేవారు. మంగళవారం ఆమె రూ.20 వేలు డ్వాక్రా గ్రూప్లో కట్టాల్సి ఉండగా సమయానికి డబ్బు అందలేదు. అవమానాల పాలవుతామనే బాధతో పురుగుల మందు తాగేసింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీకాళహస్తి రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ మెడలో
గొలుసు చోరీ
చంద్రగిరి: వాకింగ్ చేస్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు చైన్ స్నాచింగ్కు పాల్పడిన ఘటన తిరుచానూరు పోలీసు స్టేషన్ పరిధి మంగళం సమీపంలోని చెన్నాయగుంట వద్ద మంగళవారం చోటుచేసుకుంది. చెన్నాయగుంట ప్రాంతానికి చెందిన భారతి మరో మహిళతో కలసి వాకింగ్ చేసేందుకు వెళ్లింది. వాకింగ్ చేస్తున్న క్రమంలో ముఖానికి మాస్కులు ధరించుకుని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు మహిళ మెడలోని గొలుసును చోరీ చేసి పరారయ్యారు. తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జేసీబీ, రెండు ట్రాక్టర్లు సీజ్
రేణిగుంట: మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలపై గత వారంలో శ్రీసాక్షిశ్రీలో వచ్చిన వరుస కథనాలకు గాజులమండ్యం పోలీసులు స్పందించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై వరుస దాడులు నిర్వహించారు. ఎల్లమండ్యం పంచాయతీలోని పిల్లపాళ్యం సమీపంలో మంగళవారం ఉదయం జేసీబీతో ఇసుక తవ్వకాలు జరుపుతుండగా గాజులమండ్యం సీఐ మంజునాథరెడ్డి, ఎస్ఐ సుధాకర్ తమ సిబ్బందితో వెళ్లి సీజ్ చేశారు. అలాగే రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.

డ్వాక్రా మహిళ ఆత్మహత్య

డ్వాక్రా మహిళ ఆత్మహత్య