రక్షణేది బాబు? | - | Sakshi
Sakshi News home page

రక్షణేది బాబు?

Jun 11 2025 7:44 AM | Updated on Jun 11 2025 7:44 AM

రక్షణేది బాబు?

రక్షణేది బాబు?

మహిళలకు
ఏడాది పాలనలో పెరుగుతున్న అత్యాచారాలు, దాడులు

మహిళలకు రక్షణ కల్పించాలని అంబేడ్కర్‌ విగ్రం వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాళ్లు

తిరుపతి మంగళం : ‘మహిళలు మా అక్క చెల్లెమ్మలు.. తోబుట్టువులు.. మా ఇంటి ఆడపడుచులు.. మహిళలకు అన్యాయం జరిగితే ఎందాకై నా వెళ్తాం.. అంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలోకి రాగానే మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యమయ్యారు. నిత్యం అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు’ అంటూ వైఎస్సార్‌సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధవిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్‌, తిరుపతి నగర బూత్‌ కమిటీ ఇన్‌చార్జ్‌ ముప్పాల సాయికుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మంగళవారం వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాళ్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా సహించమంటూ గొంతు చించుకుని అరిచారని, వారిని నమ్మి ఓట్లేసినందుకు తగిన శాస్తి జరిగిందని మండిపడ్డారు. కూటమి నాయకుల చేతుల్లో అత్యాచారాలకు, దాడులకు గురవుతున్న మహిళలకు, బాలికలకు ఏమి న్యాయం చేశారని ప్రశ్నించారు. మహిళల పట్ల కూటమి నాయకులు కీచకుల్లా మారారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, దాడులపైన ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఓ మహిళ హోమ్‌ మంత్రిగా ఉండి కూడా మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించలేకపోతున్నారని మండిపడ్డారు.

మహిళా రక్షణ చట్టాలు నిర్వీర్యం

తిరుపతి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాళ్ల

ఆందోళన

గతంలో మహిళా రక్షణకు పెద్దపీట

గత వైఎస్సార్‌సీపీ పాలనలో తమ నాయకుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మహిళా రక్షణ కోసం దిశ, నిర్బయ వంటి అనేక చట్టాలను తీసుకొచ్చి మహిళలకు రక్షణ కల్పించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా రక్షణ చట్టాలను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. కూటమి నాయకులు మహిళల పట్ల ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్‌లో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాళ్లు గోలి విజయలక్ష్మి, పునీత, పుష్ప, శారద, శాంతారెడ్డి, రాజేశ్వరి, యశోద, రాధ, మాదవి, కృష్ణవేణమ్మ, సాయికుమారి, షర్మిల, రెడ్డిరాణి, పార్వతమ్మ, దుర్గ, కవితమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement