
దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయండి
తిరుపతి క్రైమ్: రేణిగుంటలోని సాక్షి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన వారితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేసిన వారిపై చర్యలు చేపట్టాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని సాక్షి జర్నలిస్టులు సోమవారం పలుచోట్ల పోలీసు అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. అందులో భాగంగా సోమవారం రాత్రి రేణిగుంట సీఐ జయచంద్రకు, మంగళవారం తిరుపతి అర్బన్ జిల్లా లా అండ్ ఆర్డర్ ఏఎస్పీ రవిమనోహరాచారికి సాక్షి బ్రాంచ్ మేనేజర్ సత్యేంద్రబాబు, బ్యూరో ఇన్చార్జ్ రవిరెడ్డి తదితరులు ఫిర్యాదు చేశారు. సిబ్బందికి, ఆస్తులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రెండు జిల్లాల్లోని మరికొన్ని పోలీస్ స్టేషన్లలో కూడా మంగళవారం ఫిర్యాదులు అందజేశారు.
● అధికారులకు వినతిపత్రాలు అందజేసిన ‘సాక్షి’ యాజమాన్యం

దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయండి