గజ వాహనం..భక్తజన పావనం | - | Sakshi
Sakshi News home page

గజ వాహనం..భక్తజన పావనం

Jun 11 2025 7:44 AM | Updated on Jun 11 2025 9:21 AM

● గజ

● గజ వాహనం..భక్తజన పావనం

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన మంగళవారం రాత్రి అమ్మవారు గజ వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం దివ్యాలంకార శోభితురాలైన శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై ఆశీనులై ఐదు మార్లు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి అమ్మవారు గజ వాహనాన్ని అధిష్టించి తిరువీధుల్లో ఊరేగుతూ కనువిందు చేశారు. ఇదిలావుండగా తెప్పోత్సవాల్లో చివరి రోజైన బుధవారం రాత్రి గరుడ వాహనంపై అమ్మవారు ఊరేగనున్నారు. ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, ఏఈఓ దేవారాజులు, సూపరింటెండెంట్లు రమేష్‌, శ్రీవాని, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. – చంద్రగిరి

● గజ వాహనం..భక్తజన పావనం1
1/1

● గజ వాహనం..భక్తజన పావనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement