నకిలీ పత్రాలతో ఆస్తులు అమ్మేసిన వ్యక్తి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నకిలీ పత్రాలతో ఆస్తులు అమ్మేసిన వ్యక్తి అరెస్ట్‌

Jun 9 2025 7:56 AM | Updated on Jun 10 2025 8:58 AM

నకిలీ పత్రాలతో ఆస్తులు అమ్మేసిన వ్యక్తి అరెస్ట్‌

నకిలీ పత్రాలతో ఆస్తులు అమ్మేసిన వ్యక్తి అరెస్ట్‌

తిరుపతి రూరల్‌: నకిలీ పత్రాలు సృష్టించి విలువైన ఆస్తులు కాజేసి ఇతరులకు అమ్మేసిన వ్యక్తిని తిరుపతి రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ చిన్న గోవిందు కథనం మేరకు.. తిరుపతి రూరల్‌ మండల పరిధిలోని శ్రీనివాస హౌసింగ్‌ సొసైటీలో శారద అనే మహిళకు చెందిన ఆస్తిని చంద్రగిరి మండలం గంగుడుపల్లెకు చెందిన మునిరత్నంరెడ్డి మరో ఇద్దరితో కలిసి రూ.86 లక్షలకు విక్రయించాడు.

అలాగే వేదిక్‌ అపార్ట్‌మెంట్‌లో ఒక సారి అమ్మిన స్థలాన్ని మరొకరికి కట్టబెట్టి అక్రమంగా సొమ్ము చేసుకున్నాడు. రాజ కుమారి అనే మహిళకు సంబంధించిన ఆస్తిని తన భార్యపై రిజిస్టర్‌ చేసుకుని వేరొకరికి అమ్మేశాడు. ఇలా ఎంతో మంది భూములకు నకిలీ పత్రాలతో విక్రయించినట్లు పోలీసులకు వరుస ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన పోలీసులు మునిరత్నం రెడ్డిని ఆదివారం మల్లవరం క్రాస్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. చైన్నెలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న నిందితుడి నుంచి పలు డాక్యుమెంట్లు, డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement