జోగులాంబ జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి | Three Died In Lightning Strike In Jogulamba District | Sakshi
Sakshi News home page

జోగులాంబ జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి

Sep 10 2025 6:32 PM | Updated on Sep 10 2025 7:11 PM

Three Died In Lightning Strike In Jogulamba District

సాక్షి, జోగులాంబ: అయిజ మండలం భూంపురంలో విషాదం జరిగింది. పిడుగుపాటుకు ముగ్గురు మృత్యువాత పడ్డారు.  ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులు సౌభాగ్య(40), పార్వతి (22), సర్వేష్‌ (20) గుర్తించారు.

కాగా, తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని ఐఎండీ వెల్లడించింది.

కామారెడ్డి, జనగామ, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం అసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement