Telangana: కొత్తగా 85 కరోనా కేసులు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం 10,403 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 85 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.38 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో కరోనా నుంచి 74 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8.34 లక్షలకు చేరింది. ప్రస్తుతం 514 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి.