
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం 23,780 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 345 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.32 లక్షలకు చేరింది. ఒక్క రోజులో కరోనా నుంచి 265 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.25 లక్షలకు చేరింది. ప్రస్తుతం 2,752 క్రియాశీలక కరోనా కేసులు నమోదయ్యాయి.