
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం 21,198 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 290 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8.33 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 450 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.27 లక్షలకు చేరింది. ప్రస్తుతం 2,256 క్రియాశీలక కేసులు నమోదయ్యా.