
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం 17,029 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 252 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.31 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 291 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8.25 లక్షలకు చేరింది. ప్రస్తుతం 2,672 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి.