ఆదాయం పెంపు ఎజెండాగా.. | Telangana Cabinet Meeting On May 4 | Sakshi
Sakshi News home page

ఆదాయం పెంపు ఎజెండాగా..

May 4 2026 2:21 AM | Updated on May 4 2026 2:21 AM

Telangana Cabinet Meeting On May 4

నేడు రాష్ట్ర మంత్రివర్గం భేటీ

భూముల విలువల పెంపునకు ఆమోదం తెలిపే అవకాశం

రుణాల రీస్ట్రక్చర్, ఆదాయ లీకేజీలను అరికట్టే ప్రణాళికపై చర్చ!

ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపైనా స్పష్టత వచ్చే చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: అనివార్య ఖర్చులు, నెలనెలా పెరుగుతున్న ఆర్థిక భారా­న్ని తట్టుకుని నిలబడేందుకు అవసరమైన ఆదాయ మార్గాలపై చర్చ ఎజెండాగా రాష్ట్ర మంత్రివర్గం సోమవారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌­రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈసారి కేబినెట్‌ సమావేశంలో ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదికపైనే చర్చ జరుగుతుందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. అందులో భాగంగానే రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల పెంపున­కు గ్రీన్‌సిగ్నల్‌ లభించనుందని సమాచారం.

భూముల విలువల సవరణకు సంబంధించిన ప్రక్రియను రిజిస్ట్రేషన్ల శాఖ పూర్తి చేసిన నేపథ్యంలో మంత్రి­వర్గం ఆమోదిస్తే ఈనెలలోనే, లేదంటే జూన్‌1వ తేదీ నుంచి సవరించిన విలు­వలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతో పాటు రుణాల రీస్ట్రక్చర్‌ కోసం కేంద్రానికి చేయాల్సిన ప్రతిపాదనలు, రాబడి శాఖల్లో లీకేజీ­లను అరికట్టడం లాంటి అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించి తగు నిర్ణ­యాలు తీసుకోనుంది.

అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించా­ల్సిన దాదాపు రూ.14 వేల కోట్ల బకాయిల విషయంలోనూ ఓ రోడ్‌మ్యాప్‌ తయారు చేయనున్నట్టు సమాచారం. ముఖ్యంగా రిటైరయిన ఉద్యోగులకు సంబంధించిన రూ.8 వేల కోట్ల బకాయిలను 100 రోజుల్లో చెల్లించే విషయంలో ఏం చేయాలన్న దానిపై మంత్రివర్గం ఓ కార్యాచరణ రూపొందించను­న్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు తుమ్మిడిహెట్టి బరాజ్‌ నిర్మాణం.. తదితర అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement