సచివాలయంలో 120 మందికి పదోన్నతులు!  | Telangana 120 Promotions In The Secretariat | Sakshi
Sakshi News home page

సచివాలయంలో 120 మందికి పదోన్నతులు! 

Aug 31 2021 2:17 AM | Updated on Aug 31 2021 2:17 AM

Telangana 120 Promotions In The Secretariat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సచివాలయంలో దాదాపు 120 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు రంగం సిద్ధమైంది. త్వరలో ఈ మేరకు ఉత్తర్వులు రానున్నాయని ఉద్యోగ వర్గాలు తెలిపాయి. 59 మంది అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లకు సెక్షన్‌ ఆఫీసర్లుగా, 33 మంది సెక్షన్‌ అధికారులకు  సహాయ కార్యదర్శులుగా, 20 మంది సహాయ కార్యదర్శులకు డిప్యూటీ కార్యదర్శులుగా, 8 మంది డిప్యూటీ కార్యదర్శులకు జాయింట్‌ సెక్రెటరీలుగా, నలుగురు జాయింట్‌ సెక్రెటరీలకు  అదనపు కార్యదర్శులుగా పదోన్నతి కల్పించే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్‌ ఆమోదం లభించిన వెంటనే ఉత్తర్వులు జారీ కానున్నాయని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement