సచివాలయంలో 120 మందికి పదోన్నతులు! 

Telangana 120 Promotions In The Secretariat - Sakshi

త్వరలో ఉత్తర్వులు: ఉద్యోగ సంఘాలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సచివాలయంలో దాదాపు 120 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు రంగం సిద్ధమైంది. త్వరలో ఈ మేరకు ఉత్తర్వులు రానున్నాయని ఉద్యోగ వర్గాలు తెలిపాయి. 59 మంది అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లకు సెక్షన్‌ ఆఫీసర్లుగా, 33 మంది సెక్షన్‌ అధికారులకు  సహాయ కార్యదర్శులుగా, 20 మంది సహాయ కార్యదర్శులకు డిప్యూటీ కార్యదర్శులుగా, 8 మంది డిప్యూటీ కార్యదర్శులకు జాయింట్‌ సెక్రెటరీలుగా, నలుగురు జాయింట్‌ సెక్రెటరీలకు  అదనపు కార్యదర్శులుగా పదోన్నతి కల్పించే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్‌ ఆమోదం లభించిన వెంటనే ఉత్తర్వులు జారీ కానున్నాయని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top