పెన్షన్‌ డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు | Man beats mother to death over pension | Sakshi
Sakshi News home page

పెన్షన్‌ డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు

Sep 20 2025 6:01 AM | Updated on Sep 20 2025 6:01 AM

Man beats mother to death over pension

వికారాబాద్‌ జిల్లా గడిసింగాపూర్‌లో ఘటన 

  పరిగి: పున్నామ నరకం నుంచి రక్షిస్తాడనుకున్న కొడుకు పెన్షన్‌ డబ్బుల కోసం కన్నతల్లిని చంపిన ఘటన వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మిట్టకోడూర్‌ మల్లమ్మ (57)కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ముగ్గురికీ వివాహాలు కాగా, పెద్ద కుమారుడు ఆంజనేయులు మద్యానికి బానిసయ్యాడు. ఇతని మొదటి భార్య మృతి చెందగా, రెండో భార్య విడాకులు తీసుకుంది.

ఎలాంటి సంపాదన లేకపోవడంతో తల్లికి వచ్చే ఆసరా పెన్షన్‌ డబ్బులు లాక్కుని నిత్యం మద్యం తాగేవాడు. ఇటీవల పెన్షన్‌ రావడంతో గత బుధవారం సాయంత్రం డబ్బులు ఇవ్వమని అడగ్గా.. ఆమె నిరాకరించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆంజనేయులు విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రగాయాలపాలై మరుసటి రోజు శుక్రవారం ఇంట్లోనే చనిపోయింది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. చిన్న కుమారుడు మహిపాల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపర్చిన అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement