నేటి అర్ధరాత్రి వరకే ‘మహా’ దర్శనం | Khairatabad Maha Ganapati Darshan Allowed Only Until Thursday Midnight, More Details Inside | Sakshi
Sakshi News home page

నేటి అర్ధరాత్రి వరకే ‘మహా’ దర్శనం

Sep 4 2025 9:27 AM | Updated on Sep 4 2025 10:34 AM

Khairatabad Maha Ganapati Darshan Allowed Only Until Thursday Midnight

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ మహా వినాయకుడి దర్శనానికి గురువారం అర్ధరాత్రి వరకే అనుమతి ఉంటుందని, ఆ తర్వాత భక్తుల దర్శనాలను నిలిపివేస్తామని నిర్వాహకులు తెలిపారు. శనివారం మహా వినాయకుడి నిమజ్జనం సందర్భంగా షెడ్డు తొలగింపు పనులు, క్రేన్‌ ఏర్పాట్ల కారణంగా శీఘ్ర, సర్వదర్శనాలకు అవకాశం ఉండదు. భక్తులు ఈ విషయాన్ని గమనించి నిర్వాహకులకు, పోలీసులకు సహకరించాలని కోరారు.  

1.04  లక్షల విగ్రహాల  నిమజ్జనం 
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలోని ఆరు జోన్ల పరిధిలో మంగళవారం వరకు 1,04,135 విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది. ఆయా ప్రాంతాల్లోని పెద్ద చెరువులతోపాటు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొలనుల్లో ఈ నిమజ్జనాలు జరిగాయి. వీటిలో చిన్న, పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement