నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్​

Cyberabad CP Sajjanar Gives Serious Warning To Lockdown Violaters - Sakshi

హైదరాబాద్​: తెలంగాణలో లాక్​డౌన్​ను పటిష్టంగా అమలు చేస్తున్నామని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపైకి రావోద్దని సూచించారు. గూడ్స్​ వాహనాలను రాత్రి 9 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు మాత్రమే తిరగడానికి అనుమతి ఇస్తున్నామని తెలిపారు.  

జిల్లా బార్డర్​ చెక్​ పోస్ట్​లలో సైతం తనిఖీని పటిష్టంగా అమలు చేస్తున్నామని  అన్నారు. కొంత మంది కావాలని పాస్​లను మిస్​యూస్​ చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా, కొంత మంది ప్రెస్​ అంటూ నకిలీ స్టిక్కర్​లను తమ వాహనాలకు అంటించుకుని బయట తిరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని,  వీరిపై చలాన్స్ విధించడంతో​ పాటు, క్రిమినల్​ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు లాక్​డౌన్​ నిబంధనలను విధిగా పాటించాలని, లేకుంటే వారిపై కఠిన చర్యలు తప్పవని తెలపారు.

చదవండి​: ఆకలి తీరుస్తూ.. ఆదుకుంటూ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top