తెలంగాణలో భారీగా కరోనా కేసులు | Coronavirus: 1989 New Positive Cases Registered In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

Jul 31 2020 10:40 AM | Updated on Jul 31 2020 11:46 AM

Coronavirus: 1989 New Positive Cases Registered In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 1,989 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  దీంతో మొత్తం బాధితుల సంఖ్య 62,703కు పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గురువారం ఒక్కరోజే కరోనాతో 14 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 519కి చేరింది. కరోనా నుంచి కోలుకుని గత 24 గంటల్లో 816 మంది డిశ్చార్జ్ అయ్యారు.  దీంతో కరోనా నంచి కోలుకొని  డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 45,388కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,796 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. (చదవండి : భారత్: 16 లక్షలు దాటిన కరోనా కేసులు)

తాజా కేసుల్లో 586 జీహెచ్ఎంసీ పరిధిలో వెలుగు చూశాయి. మిగిలిన వాటిలో మేడ్చల్‌207, రంగారెడ్డిలో 205, వరంగల్‌ అర్బన్‌లో 123, కరీంనగర్‌లో 116, సంగారెడ్డిలో 108, మెదక్‌లో 45, ఖమ్మంలో 41, మహబూబ్‌నగర్‌లో 61, నల్గొండలో 36, మంచిర్యాలలో 35, గద్వాలలో 32, నాగర్‌ కర్నూలులో 30, వరంగల్‌ గ్రామీణ జిల్లాలో 30, భద్రాద్రి కొత్తగూడెంలో 29, ములుగులో 27, పెద్దపల్లిలో 26, సిరిసిల్లలో 23, జనగామలో 21, సిద్ధిపేట జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి. (చదవండి : కరోనాతో ఆ కుక్క చనిపోయింది..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement