అదుపుతప్పి దూసుకెళ్లిన కారు | - | Sakshi
Sakshi News home page

అదుపుతప్పి దూసుకెళ్లిన కారు

May 2 2026 7:38 AM | Updated on May 2 2026 7:38 AM

అన్నానగర్‌: కరూర్‌ జిల్లాలోని చెన్నిమలైపాలైయంకు చెందిన గుణశేఖర్‌(51) ఒక రైతు. ఇతని తల్లి భానుమతి(70). ఇతని సోదరి జయలక్ష్మి(46). వీరంతా గురువారం తిరుప్పూర్‌ జిల్లాలోని కాంగేయంలో ఉన్న ఒక బంధువును కలిసి కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. గుణశేఖరన్‌ కారు నడుపుతున్నాడు. వెల్లకోవిల్‌–కరూర్‌ జాతీయ రహదారి కూడలి వద్దకు చేరుకున్నప్పుడు కారు అకస్మాత్తుగా అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.

ఒకానొక సమయంలో ఆ కారు రోడ్డు పక్కనే ఉన్న కురుక్కతి నివాసి సత్తివేల్‌ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ ఇంటి గోడ కూలిపోయింది. అనంతరం ఆ కారు ఇంటి ఆవరణలోని అరటి చెట్టును ఢీ కొట్టి ఆగిపోయింది.ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. భానుమతిని కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స అందక ఆమె మరణించింది. గుణశేఖరన్‌, జయలక్ష్మి చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement