వేలూరు: తిరువణ్ణామలై అన్నామలైయార్ ఆలయంలో సౌమ్య అన్బుమణి గురువారం తన కుమార్తెతో పాటు వచ్చి అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఉంచి పూజలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీలకు చెందిన నియోజకవర్గాల పేర్లను అన్నాడీఎంకే పార్టీ రాష్ట్ర ఆర్గనైజర్ ఎడపాడి పళణిస్వామి బుధవారం ఉదయం ప్రకటించారు. ఇందులో పీఎంకే పార్టీకి 18 నియోజక వర్గాలు కేటాయించారు. దీంతో పీఎంకే పార్టీ అద్యక్షుడు అన్బుమణి సతీమణి సౌమ్య తన కుమార్తెతో వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. ముందుగా సంపద వినాయకుడి ఆలయంలో పీఎంకే పార్టీ ఆధ్వర్యంలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నామలైయార్ సన్నధి, ఉన్నామలై అమ్మన్ సన్నధికి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. త్వరలోనే నియోజక వర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను అన్బుమణి ప్రకటిస్తారని ఆమె తెలిపారు.
ఏడుగురు జాలర్ల అరెస్ట్
కొరుక్కుపేట: రామేశ్వరానికి చెందిన ఏడుగురు జాలర్లు అరెస్టు అయ్యారు.రామనాథపురం జిల్లాలో సముద్రంలోకి వెళ్లిన జాలర్లు రాత్రిపూట సముద్రం మధ్యలో చేపలు పడుతుండగా పట్టుబడ్డారు, అయితే వారిని చేపలు పట్టనివ్వకుండా తరిమికొట్టారు. రామేశ్వరం మత్స్య రేవులో ఆరు పడవలు లంగరు వేసినప్పుడు, గస్తీ పడవలు వాటిని అడ్డుకోవడంతో, కొంతమంది మత్స్యకారులు మరో ప్రాంతానికి వెళ్లి చేపలు పట్టారు. ఈ పరిస్థితిలో, అక్కడికి చేరుకున్న శ్రీలంక నావికాదళం తిరిగి రామేశ్వరం మత్స్యకారుల పడవలను చుట్టుముట్టి ఏడుగురిని అరెస్టు చేసింది. ఈఘటన రామేశ్వరం మత్స్యకారులలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది.


