శివాలయాల్లో ఘనంగా ప్రదోష పూజలు
వేలూరు : వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని శివాలయాల్లో తమిళ మార్గళి మాస ప్రదోష దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ప్రదోష పూజలను నిర్వహించారు. ముందుగా తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని అధికార పెద్ద నంది భగవాన్కు శివాచార్యులు వేద మంత్రాలచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టి కాయకూరలు, పుష్పాలంకరణ చేపట్టారు. అనంతరం భక్తుల అధిక సంఖ్యలో చేరుకొని హరోం హర నామ స్మరణాల మద్య శివాచార్యులు వేద మంత్రాల నడుమ కర్పూర హారతులు పట్టారు. అనంతరం స్వామి వార్లును అధికార నంది వాహనంలో ఆశీనులు చేసి మాడ వీధుల్లో మేళ తాలాల నడుమ ఊరేగించారు. అదేవిధంగా వేలూరు కోట మైదానంలోని జల కంఠేశ్వరాలయంలో నంది భగవాన్కు శివాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి కాయకూరలతో అలంకరించారు. అనంతరం నంది భగవాన్కు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. అదేవిధంగా వేలూరు, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, రాణిపేట వంటి జిల్లాలోని శివాలయాల్లోని నంది భగవాన్కు ప్రత్యేకే పూజలు చేసి కాయ కూరలతో అలంకరణలు చేసి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అరుణాచలేశ్వరునికి హరోంహరా నామ స్మరణలతో మొక్కులు తీర్చుకున్నారు.
అరుణాచలేశ్వరాలయంలోని అధికార నంది భగవాన్కు అభిషేకం చేస్తున్న శివాచార్యులు, పాల్గొన్న భక్తులు
శివాలయాల్లో ఘనంగా ప్రదోష పూజలు


