అన్నానగర్లో హైరిస్క్ ప్రెగ్నెన్సీ యూనిట్ ఏర్పాటు
సాక్షి, చైన్నె: చైన్నె అన్నానగర్లోని రెయిన్ బో చిల్డ్రన్స్ ఆస్పత్రిలో సుభిక్ష– సమగ్ర హై రిస్క్ ప్రెగ్నెన్సీ యూనిట్ను ఏర్పాటు చేశారు. దీనిని ఎమ్మెల్యే ఎంకే మోహన్ ప్రారంభించారు. ఇందులో పూర్తిగా లెవల్ 2 ఎన్ఐసీయూ, అధునాతన పిండ నిర్ధారణతో 24 గంటల ప్రసూతి, నియోనాటల్ సంరక్షణ సేవలను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆ ఆస్పత్రి గైనకాలిజిస్టు డాక్టర్ వి శాంత, నియోనాటలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్శోభన రాజేంద్రన్, టీఎన్, ఏపీ జోనల్ డైరెక్టర్ భాస్కర్రెడ్డిలు మాట్లాడుతూ నవ జాత శిశువు సేవలను విస్తరించడానికి నిబద్ధతతో ఈ యూనిట్ను ఏర్పాటు చేశామని వివరించారు. సమగ్ర సంరక్షణ సేవలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.


