గ్రీవెన్స్డేలో వినతుల స్వీకరణ
తిరువళ్లూరు: సోమవారం ఉదయం గ్రీవెన్స్డేను కలెక్టర్ ప్రతాప్ అధ్యక్షతన నిర్వహించారు. పట్టాల కోసం 53, సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోకి 39, మౌలిక వసతుల కోసం 32 వినతులు సహా మొత్తం 195 వినతులు వచ్చాయి. అనంతరం ఆదిద్రావిడ సంక్షేమశాఖ తాడ్కో ద్వారా 9 మంది అర్హులకు ఐదు లక్షల చొప్పున 45 లక్షలు విలువ చేసే ఇంటి స్థలాలను కలెక్టర్ పంపిణీ చేశారు. దీంతో పాటూ డ్రాయింగ్ పోటీల్లో విజయం సాధించిన 25 మంది దివ్యాంగులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సురేష్, పీఏజీ వెంకట్రామన్, డిప్యూటి కలెక్టర్ బాలమురుగన్ పాల్గొన్నారు.


