సర్వదర్శనానికి 12 గంటలు | - | Sakshi
Sakshi News home page

సర్వదర్శనానికి 12 గంటలు

Jul 24 2025 8:47 AM | Updated on Jul 24 2025 8:47 AM

సర్వదర్శనానికి 12 గంటలు

సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండాయి. క్యూ నారాయణగిరి వరకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 79,467 మంది స్వామివారిని దర్శించుకోగా 28,642 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.42 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement