లాకప్‌ డెత్‌ను నిరసిస్తూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా | - | Sakshi
Sakshi News home page

లాకప్‌ డెత్‌ను నిరసిస్తూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా

Jul 4 2025 6:49 AM | Updated on Jul 4 2025 6:49 AM

లాకప్‌ డెత్‌ను నిరసిస్తూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా

లాకప్‌ డెత్‌ను నిరసిస్తూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా

తిరువళ్లూరు: శివగంగై జిల్లా తిరుపువనం యూనియన్‌ పరిధిలో అజిత్‌ లాకప్‌డెత్‌ను నిరసిస్తూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం గుమ్మిడిపూండిలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి డీవైఎఫ్‌ఐ డివిజన్‌ అధ్యక్షుడు మునిరత్నం అధ్యక్షత వహించగా సంఘం జిల్లా అధ్యక్షుడు కలైయరసన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలైయరసన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తరచూ లాకప్‌డెత్‌లు జరుగుతున్నా ఇంతవరకు సరైన న్యాయం జరగలేదన్నారు. పోలీసు స్టేషన్లలో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఆధారంగా లాకప్‌డెత్‌పై పూర్థిస్థాయి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement