
తిరుమల పయనం
ఘనంగా అర్ధనారీశ్వరుడి
సేలం: నమక్కల్ – తిరుచెంగోడ్ నుంచి అర్ధనారీశ్వర స్వామి తిరుమలకు పయనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నామక్కల్ జిల్లా తిరుచెంగోడ్లోని ప్రసిద్ధ అర్ధనారీశ్వర స్వామి ఆలయంలో వైఖాసి విశాఖ తేరు ఉత్సవం ఒకటో తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమైంది. 10వ తేదీ నుంచి మూడు రోజులపాటు పవిత్ర స్థలంలో పుర వీధుల్లో ఊరేగుతూ వేలాది మంది భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం శుక్రవారం నుంచి అర్ధనారీశ్వర స్వామి ఊరేగింపు 14 రోజుల పాటు ఉత్సవాలు కనుపండువగా సాగాయి. శనివారం అర్ధనారీశ్వర స్వామి తన పరివార దేవతలతో తిరుమలకు అధిరోహించే కార్యక్రమం జరిగింది. ఇందులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శనం చేసుకున్నారు.

తిరుమల పయనం

తిరుమల పయనం