యోగా ఉత్సవ బ్యానర్లపై తమిళం లేకపోవడంపై నిరసన | - | Sakshi
Sakshi News home page

యోగా ఉత్సవ బ్యానర్లపై తమిళం లేకపోవడంపై నిరసన

May 27 2025 1:55 AM | Updated on May 27 2025 1:55 AM

యోగా

యోగా ఉత్సవ బ్యానర్లపై తమిళం లేకపోవడంపై నిరసన

కొరుక్కుపేట: కేంద్ర ప్రభుత్వ ఆయుష్‌ సంస్థ తరపున పుదుచ్చేరిలో మంగళవారం అంతర్జాతీయ యోగా ఉత్సవం జరగనుంది. పుదుచ్చేరి బీచ్‌ రోడ్డులో జరిగే ఈ ఉత్సవానికి గవర్నర్‌, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అనేక ఇతర ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు హాజరవుతారు. దీనికోసం పుదుచ్చేరి అంతటా ప్రకటన బ్యానర్లు ఏర్పాటు చేయబడ్డాయి.ఈ ప్రకటనల బ్యానర్లను అజంతా సిగ్నల్‌, రాజా జంక్షన్‌, అన్నా విగ్రహం, కామరాజ్‌ విగ్రహం, ఇందిరా గాంధీ విగ్రహం, రాజీవ్‌ విగ్రహం, కూడళ్లు వంటి ప్రధాన రోడ్డు జంక్షన్లలో, గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఇంగ్లీష్‌, హిందీ భాషలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తమిళంలో ఎక్కడ చూసినా ప్రకటనల బ్యానర్‌లు లేవు .ఇటీవల పుదుచ్చేరిలో జరిగిన శాసనసభ సమావేశంలో ముఖ్యమంత్రి రంగసామి మాట్లాడుతూ, వాణిజ్య సంస్థల నేమ్‌ప్లేట్లు తమిళంలో ఉండా లని ఆదేశించారు. అయితే ఆయుష్‌ ఈ ఆదేశాన్ని పాటించలేదు. ఇదేసమయంలో యోగా ఉత్సవంలో బ్యానర్ల ప్రకటనలో తమిళాన్ని చేర్చక పో వడం తమిళ కార్యకర్తలలో తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ స్థితిలో యోగా ఉత్సవ బ్యానర్లపై ఉన్న హిందీ , ఇంగ్లీషు పదాలపై సిరాతో చెరి పేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమిళ భాషను నిర్లక్ష్యం చేయడాన్ని ఖండిస్తూ నినాదాలు కూడా చేశారు.

ఐఐటీలో కొత్త కోర్సులు

సాక్షి, చైన్నె: 2025–26 విద్యా సంవత్సరానికి ఐఐటీ మద్రాస్‌ అనేక కొత్త కార్యక్రమాల మీద దృష్టి పెట్టింది. తాజాగా విద్యా , ఆటోమోటివ్‌ పరిశ్రమ రెండింటిలోనూ సంక్లిష్టమైన వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో నాయకత్వ పాత్రలకు గ్రాడ్యుయేట్లను సిద్ధం చేయడం లక్ష్యంగా కొత్త కోర్సుల ను ప్రవేశ పెట్టింది. ఈ వివరాలను సోమవారం స్థానికంగా ఐఐటీ మద్రాసు వర్గాలు ప్రకటించాయి. బీఎస్‌ కెమిస్ట్రీ, ఎంటెక్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కోర్సులు ఇందులో ఉన్నాయి. 2025 – 26 విద్యా సంవత్సరం నుంచి అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రా మ్‌లకు ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌ ఎక్సెలెన్స్‌ ప్రవేశాన్ని ప్రవేశ పెట్టారు. తద్వారా లలిత కళలు సంస్కృతిలో రాణించిన విద్యార్థులకు బహుమతు లు, ప్రోత్సహం దిశగా ఎఫ్‌ఏసీఈ ద్వారా అడ్మిషన్‌ ప్రక్రియ జాయింట్‌ సీట్‌ అలోకేషన్‌ అథారిటీ పోర్టల్‌ ద్వారా కాకుండా ప్రత్యేక పోర్టల్‌ (https://ugadmissions.iitm.ac.in/face/)లో జరుగుతుందని ప్రకటించారు. ఈ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు గురించి ఐఐటీ మద్రాసు డీన్‌ (అకడమిక్‌ కోర్సులు) ప్రొఫెసర్‌ ప్రతాప్‌ హరిదాస్‌ మాట్లాడుతూ, ఈ కొత్త కోర్సులు పరిశ్రమ, విద్యా సంస్థల అవసరాలు , విద్యా ర్థుల ఆకాంక్షలను దృష్టి లో ఉంచుకుని ప్రవేశపెట్టబడ్డాయని వివరిచారు. ఈ సంవత్సరం ప్రారంభించబడిన కొత్త ప్రోగ్రామ్‌లుగా బీఎస్‌ (కెమిస్ట్రీ) ఐఐఎస్‌ఈఆర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశం కల్పిస్తామన్నారు. ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ లో ఎంటెక్‌ – గేట్‌ ద్వా రా ప్రవేశం ఉంటుందని ప్రకటించారు. అప్లైడ్‌ మెకానిక్స్‌, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం లో రెండు కొత్త బీటెక్‌ ప్రోగ్రామ్‌లకు జేఈఈ ద్వారా ప్రవేశం ఉంటుందని వివరించారు. కంప్యూటేషనల్‌ ఇంజినీరింగ్‌ మెకానిక్స్‌లో బిటెక్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ అనేది 4 సంవత్సరాల అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లు గా ఉంటుందని, ఇది కెమిస్ట్రీలో ఎంఎస్‌కు అప్‌గ్రేడ్‌ చేసుకునే అవకాశం కలిగి ఉంటుందన్నారు. ఇది విద్యార్థులకు కెమిస్ట్రీ, అనుబంధ సైన్స్‌ సబ్జెక్టులలో బలమైన పునాదిగా ఉంటుందన్నారు.

విస్తృతంగా సమగ్ర ఆరోగ్య

సంరక్షణ సేవలు

సాక్షి, చైన్నె: ఆయూష్‌ వైద్య విలువలను విస్తతం చేసి , సమగ్ర ఆరోగ్య సేవల మీద దృష్టి పెట్టనున్నామని దక్షిణ ప్రాంతీయ సమావేశంలో నిపుణు లు వ్యాఖ్యానించారు. ఆయుష్‌ వైద్య విలువలపై దక్షిణ ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశం చైన్నెలోని హిల్టన్‌లో సోమవారం జరిగింది. ఆయూష్‌ ప్ర యాణం, లక్ష్యాలను సాధించే దిశగా ఒక ముఖ్యౖ మెన అడుగుగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ ఆశయాలకు అనుగుణంగా సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవల విస్తృతం, ప్రపంచ కేంద్రంగా ఆయుష్‌ మెడికల్‌ వాల్యూ ట్రావెల్‌ – ప్రమోటింగ్‌ వెల్నెస్‌’ కార్యక్రమాల నిర్వహణకుఇందులో నిర్ణయించారు. ప్రపంచ సంబంధాలను బలోపేతం చేయడం గురించి చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. కేరళలోని పంచకర్మ కేంద్రాల గొప్ప వారసత్వం, తమిళనాడు, కర్ణాటకలో సిద్ధ, ప్రకృతి వైద్య సేవల విస్తృతం, అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పరిశోధన , వెల్నెస్‌ మౌలిక సదుపాయాలు, దేశవ్యాప్తంగా సమగ్ర సంరక్షణకు పుదుచ్చేరిని ఒక వేదికగా ఎంపిక చేసుకునే విధంగా ప్రతినిధులు ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఆయూష్‌ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌ రావ్‌ జాదవ్‌, ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, ఆయూష్‌ సంయుక్త కార్యదర్శి మోనాలి షా దాస్‌, ఫిక్కీ ఆయూష్‌ కమిటీ వర్గాలు శ్రీనివాసరావు చింత పాల్గొన్నారు.

యోగా ఉత్సవ బ్యానర్లపై తమిళం లేకపోవడంపై నిరసన 
1
1/1

యోగా ఉత్సవ బ్యానర్లపై తమిళం లేకపోవడంపై నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement