● మేడే పార్క్‌లో వీర వందనం ● కార్మికుడిగా మారిన సీఎం స్టాలిన్‌ ● ఇది సామాన్య ప్రజల ప్రభుత్వం అని వ్యాఖ్య | - | Sakshi
Sakshi News home page

● మేడే పార్క్‌లో వీర వందనం ● కార్మికుడిగా మారిన సీఎం స్టాలిన్‌ ● ఇది సామాన్య ప్రజల ప్రభుత్వం అని వ్యాఖ్య

May 2 2025 1:49 AM | Updated on May 2 2025 1:49 AM

● మేడ

● మేడే పార్క్‌లో వీర వందనం ● కార్మికుడిగా మారిన సీఎం స్

సాక్షి, చైన్నె: ప్రపంచ కార్మికుల హక్కుల దినోత్సవం మేడే. ఈ పర్వదినం కార్మికులకు పండుగ రోజే. ఆ దిశగా రాష్ట్రంలోని కార్మిక లోకం వాడవాడలా తమ పండుగను ఘనంగా గురువారం జరుపుకున్నాయి. కర్షక చిహ్నాలతో కూడిన జెండాల్ని ఎగుర వేశారు. స్వీట్లు , మిఠాయిలు పంచుకున్నారు. ఇక అధికార డీఎంకే, ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేతో పాటూ కాంగ్రెస్‌, డీఎండీకే, సీపీఎం, సీపీఐ తదితర పార్టీల అనుబంధ కార్మిక సంఘాల నేతృత్వంలోనూ వేడుకలు ఘనంగా జరిగాయి. ర్యాలీలు, జెండాల ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే కొన్నిచోట్ల పేద కార్మికులకు సంక్షేమ పథకాల పంపిణీ సాగాయి.

అంబత్తూరులో..

తమిళ మానిల కాంగ్రెస్‌ నేతృత్వంలో మేడే కార్యక్రమం కార్మికుల సంక్షేమ సహాయ దినోత్సవంగా నిర్వహించారు. అంబత్తూరులో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ జీకే వాసన్‌, ప్రధాన కార్యదర్శి జీఆర్‌ వెంకటేష్‌, నేతలు పి. జవహర్‌బాబు, తిరువెంగడం, శక్తి వడివేలు తదతరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు సంక్షేమ పథకాలను అందజేశారు. ఇక కోయంబేడులోని రాష్ట్ర కార్యాలయంలో పార్టీ డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్‌ జెండాఎగుర వేసి, కార్మికులకు సహాయకాలను అందజేశారు. సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీనాయకులు నల్లకన్ను , ముత్తరసన్‌ జెండా ఎగుర వేశారు. ిసీపీఎం కార్యాలయంలో నేతలు రామకృష్ణన్‌ తదితరులు, ఎండీఎంకే కార్యాలయంలో నేతలు వైగో, తదితరులు కార్మిక జెండాలను ఆవిష్కరించారు. వీర వందనం సమర్పించారు.

సామాన్యుడి ప్రభుత్వం..

మేడే పార్కు వద్ద జరిగిన సభలో సీఎం స్టాలిన్‌ ప్రసంగించారు. ఏటా కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేస్తూ, కార్మికుడు తలచుకుంటే చేయని పని అంటూ ఉండదన్నారు. శ్రామిక సహచరులు వారికి ఉన్న హక్కులను గురించి సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. ద్రవిడులు కార్మికులు అని పేర్కొంటూ, దివంగత నేతలు పెరియార్‌, అన్నా , కలైంజ్ఞర్‌ కరుణానిధి కర్షక జీవుల సంక్షేమార్థం చేసిన పనులను వివరించారు. మే దినోత్సవం స్మారకంగా ఇక్కడ పార్కును నిర్మించింది కూడా కలైంజ్ఞర్‌ అని గుర్తు చేశారు. నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వం ఎన్నో పథకాలను, ప్రాజెక్టులను అమల్లోకి తెచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు విజయవంతంగా అమలు చేస్తూ వస్తున్నామని, ఇందులో 28 లక్షల 87 వేల 382 మంది అసంఘటిత కార్మికులకు రూ.2,461 కోట్లు విలువైన సంక్షేమ సహాయాన్ని అందించామని వివరించారు. కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేశామని, బాణా సంచా ప్రమాదాలలో మరణించే కార్మికుల పిల్లలకు విద్యా పరంగా స్కాలర్‌ షిప్‌లు అందించబోతున్నామన్నారు. తమిళనాడులో పారిశ్రామిక వృద్ధి పెరుగుతోందని, కార్మికుల సంఖ్య కూడా పెరుగుతున్నట్టు వివరించారు. భవిష్యత్‌ ప్రగతికి ఓ లక్ష్యాన్ని నిర్దేశించకున్నట్లే, ఈ ప్రభుత్వం శ్రామికశక్తి అభివృద్ధికి లక్ష్యాన్ని నిర్ణయించి పనిచేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఎలాంటి అవగాహన ఒప్పందం జరిగినా, ముందుగా ఎంత మందికి ఉపాధి కల్పించగలమన్న ప్రశ్నను తాను లేవ దీస్తుంటానని వ్యాఖ్యానించారు. ఇది సామాన్య ప్రజల ప్రభుత్వం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తానూ కార్మికులలో ఒకడ్ని అని, ప్రభుత్వం కూడా అందరికీ సమానం అని తెలిపారు. దేశాన్ని సమానత్వ నగరంగా మార్చడమే తమ లక్ష్యం అన్నారు.

మేడే పార్క్‌లో..

చింతాద్రి పేటలోని మేడే పార్క్‌లో ఉన్న స్మారక స్తూపానికి వీర వందనం సమర్పించేందుకు పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు తరలివచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగైతో పాటూ నేతలు తరలి వచ్చి వీర వందనం సమర్పించారు. వీసీకే నేత బాలసింగం నేతృత్వంలో ఆ పార్టీ వర్గాలు తరలి వచ్చారు. సీఎం ఎంకే స్టాలిన్‌, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్‌లతో పాటుగా మంత్రులు తరలి వచ్చి పుష్పగుచ్ఛాలను ఉంచి వీర వందనం సమర్పించారు. సీఎం స్టాలిన్‌ అయితే, తానూ ఓ కార్మికుడినే అని చాటే విధంగా ఎరుపు రంగు చొక్కా ధరించి వచ్చారు. కార్యక్రమంలో డీఎంకే ఎంపీ టీఆర్‌బాలు, షణ్ముగం తదితరులు పాల్గొన్నారు.

● మేడే పార్క్‌లో వీర వందనం ● కార్మికుడిగా మారిన సీఎం స్1
1/1

● మేడే పార్క్‌లో వీర వందనం ● కార్మికుడిగా మారిన సీఎం స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement