
కొవ్వొత్తులతో ర్యాలీ
వేలూరు: కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి ఆత్మశాంతి కలగాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేలూరులోని అన్నారోడ్డులో కొవ్వొత్తులతో ర్యాలీగా వచ్చి నివాళులర్పించారు. ముందుగా ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పీపీ చంద్రప్రకాష్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ర్యాలీగా వచ్చి తీవ్ర వాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కశ్మీర్ రాష్ట్రం పెహల్లాం సమీపంలో తీవ్రవాదులు పర్యాటకులపై దాడి చేసి హత మార్చడం సరికాదన్నారు. అనంతరం పట్టణంలో మౌనంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు వాహీద్బాషా, ఎస్సీఎస్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిత్తరంజన్, రఘు, మనోహరన్, కేవీ కుప్పం లోకనాథన్, హరిక్రిష్ణన్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఆలీజిన్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.