ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యం

Jun 1 2025 1:16 AM | Updated on Jun 1 2025 1:16 AM

ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యం

ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యం

కొరుక్కుపేట: కమ్మవారందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రపంచ స్థాయిలో కమ్మ గ్లోబల్‌ ఫెడరేషన్‌ (కేజీఎఫ్‌) ఏర్పాటు చేశారు. దేశంలో ప్రపంచంలో అనేక కమ్మ సంఘాలు ఉన్నప్పటికీ వారందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేలా కమ్మ గ్లోబల్‌ ఫెడరేషన్‌ ఏర్పాటు చేసినట్లు కేజీఫ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్‌ తెలిపారు. చైన్నెలో ప్రెస్‌ క్లబ్‌ వేదికగా విలేకరుల సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కమ్మవారు అన్ని రంగాల్లో రాణిస్తూ సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్నట్లు తెలిపారు అన్ని పార్టీల్లో కమ్మవారు ఎదగాలన్న లక్ష్యంతో కేజీఎఫ్‌ పనిచేస్తుందన్నారు. రాబోయే డిసెంబర్‌, జనవరిలో 10 లక్షల మందితో కేజీఎఫ్‌ మెగా సమ్మిట్‌ను తమిళ కమ్మ మహానాడుగా జరపాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. ఆదివారం చైన్నెలోని పూందమల్లి హైరోడ్డు, అమింజ్‌ కరైలో ఉన్న అయ్యావో మహల్‌ వేదికగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

అదేవిధంగా జూన్‌ 15న మదురైలోనూ, జూన్‌ 22న కోయంబత్తూరులోనూ సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కేజీఎఫ్‌–తమిళనాడు ప్రముఖులు రంగభాష్యం, ముండ్రు శ్రీనివాస్‌ రావు, ప్రతాప్‌ నాయుడు, రామన్‌నాయుడు, డి.నరేంద్రన్‌ నాయుడు, నేతాజీ నాయుడు, డి.పురుషోత్తం నాయుడు, టి.సురేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement