కోలాహలంగా కరుణానిధి జయంతి | - | Sakshi
Sakshi News home page

కోలాహలంగా కరుణానిధి జయంతి

Jun 4 2025 12:50 AM | Updated on Jun 4 2025 12:50 AM

కోలాహ

కోలాహలంగా కరుణానిధి జయంతి

తిరువళ్లూరు: మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 102వ జయంతి వేడుకలను తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా మంగళవారం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్నదానం, రక్తదానం, వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ కార్యాలయంలోని కరుణానిధి విగ్రహానికి, వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ఆవడిలో మంత్రి నాజర్‌, తిరువళ్లూరులో ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్‌, పూందమల్లిలో ఎమ్మెల్యే కృష్ణస్వామి, మధురవాయల్‌లో ఎమ్మెల్యే కారపాక్కం గణపతి, గుమ్మిడిపూండిలో ఎమ్మెల్యే టీజేఎస్‌ గోవిందరాజన్‌, పొన్నేరీలో పార్టీ ఇన్‌చార్జ్‌ రమేష్‌రాజ్‌ నేతృత్వంలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తిరువళ్లూరులో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఉదయమలర్‌, కౌన్సిలర్లు అరుణ, జాన్‌, థామస్‌, సుమిత్ర, ప్రభాకరన్‌, తిరువేళాంగాడు యూనియన్‌ ఉప కార్యదర్శి కాంచీపాడి శరవణన్‌, ఎన్‌ఆర్‌ఐ విభాగం జిల్లా కార్యదర్శి జైకృష్ణ, వర్తక విభాగం కార్యదర్శి నేతాజీ, న్యాయవిభాగం కార్యదర్శి బికే నాగరాజ్‌, యూనీయన్‌ కార్యదర్శులు గూలూరు రాజేంద్రన్‌ పాల్గొన్నారు.

తిరుత్తణిలో..

తిరుత్తణి: మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు దివంగత కరుణానిధి 102వ జయంతి వేడుకలు మంగళవారం కోలాహలంగా నిర్వహించారు. తిరుత్తణిలోని డీఎంకే జిల్లా కార్యదర్శి కార్యాలయంలో అలంకరించిన కరుణాఽనిధి చిత్రపటానికి జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే చంద్రన్‌ నివాళులర్పించారు. పేదలకు అన్నదానం చేశారు. నగర కార్యదర్శి వినోత్‌కుమార్‌, సీనియర్‌ న్యాయవాది కిషోర్‌రెడ్డి, నగర నాయకులు గణేశన్‌, అశోకన్‌ పాల్గొన్నారు. తిరుత్తణి తూర్పు మండల డీఎంకే కార్యదర్శి ఆర్తి రవి ఆధ్వర్యంలో వేలంజేరి, పట్టాభిరామాపురం, కాశీనాథపురం సహా 8 గ్రామాల్లో కరుణానిధి జయంతి వేడుకలు జరుపుకున్నారు. వేడుకల్లో ఎమ్మెల్యే చంద్రన్‌ పాల్గొని, పేదలకు అన్నదానం చేశారు. పళ్లిపట్టు సౌత్‌ మండల కార్యదర్శి జి.రవీంద్ర అధ్యక్షతన కీచ్చళం, నొచ్చిలి, జంగాళపల్లె, సొరకాపేట, పెరుమానళ్లూరు తదితర గ్రామాల్లో కరుణానిధి జయంతి వేడుకలు నిర్వహించి, పేదలకు సహాయకాలు పంపిణీ చేశారు. యూనియన్‌ నాయకులు గోపి, గోవిందస్వామి.భారతి, అచ్చుదన్‌, మోహన్‌ పాల్గొన్నారు. అలాగే పళ్లిపట్టు, ఆర్కేపేట, తిరుత్తణి, తిరువలంగాడు మాండలాల్లో కరుణానిధి జయంతి వేడుకలు జరుపుకున్నారు.

వేలూరులో..

వేలూరు:మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 102వ జయంతి వేడుకలను వేలూరు, రాణిపేట, తిరుపత్తూరు, తిరువణ్ణామలై జిల్లాలో కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో చేరుకుని ఘనంగా జరుపుకున్నారు. వేలూరులోని డీఎంకే పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నందకుమార్‌ అధ్యక్షతన కరుణానిధి చిత్ర పటానికి పూల మాల వేసి, నివాళులర్పించారు. అనంతరం వెయ్యి మందికి బిర్యానీ దానం చేశారు. అలాగే సత్‌వచ్చారిలోని 21వ వార్డులో వార్డు ప్రతినిధి వల్లలార్‌ రమేష్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ కదీర్‌ ఆనంద్‌ పాల్గొని, నిరుపేద మహిళలకు దుస్తులు, నిత్యావసర వస్తువులు పంపిణీతోపాటు అన్నదానం చేశారు. అనంతరం పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం కాట్పాడిలోని చిత్తూరు బస్టాండ్‌లో కరుణానిధి చిత్ర పటానికి పూల మాల వేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా డీఎంకే కార్యకర్తలు డీఎంకే పార్టీ కార్యాలయంలో కరుణానిధి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. సేనూరులో డీఎంకే యూనియన్‌ కౌన్సిలర్‌ ప్రభు అధ్యక్షతన యూనియన్‌ వైస్‌ చైర్మన్‌ శరవణన్‌, మాజీ సర్పంచ్‌ పంజాచరం, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని, కరుణానిధి చిత్ర పటానికి పూల మాల వేసి, నిరుపేదలకు బిర్యాని దానంగా అందజేశారు. తిరువణ్ణామలై జిల్లాలోను మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీధరన్‌ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు కరుణానిధి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

కోలాహలంగా కరుణానిధి జయంతి1
1/2

కోలాహలంగా కరుణానిధి జయంతి

కోలాహలంగా కరుణానిధి జయంతి2
2/2

కోలాహలంగా కరుణానిధి జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement