రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

Apr 24 2025 1:35 AM | Updated on Apr 24 2025 1:35 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

కొరుక్కుపేట: కార్గో వాహనాన్ని ద్విచక్రవాహనం ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు . ఈ సంఘటన ఈరోడ్డు లో చోటుచేసుకుంది. వివరాలు.. తిరుచెంగోడ్‌లోని ఈరోడ్‌ రోడ్డులోని కేఎస్‌ఆర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో బీసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పశుపతిపాళెం ప్రాంతానికి చెందిన బాలాజీ(19), వెంగమేడుకు చెందిన తిరుపతి (19 ) సెమిస్టర్‌ పరీక్షలు రాసి ద్విచక్ర వాహనంపై కరూర్‌కు బయలుదేరారు. తిరుపతి స్థానిక పండుగ కోసం బిజీగా ఉండటంతో, వారిద్దరూ ఎప్పటిలాగే బస్సు ఎక్కకుండా ద్విచక్ర వాహనంపై వెళ్లారు. సిత్తలందూర్‌ సమీపంలోని కట్టుపాళయం డివిజన్‌ రోడ్డు సమీపంలో వారు ప్రయాణిస్తుండగా, ఎదురుగా వస్తున్న మహీంద్రా బొలెరో కార్గో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ముక్కలైపోయింది, తాను ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టానని తెలియక బొలెరో డ్రైవర్‌ రమేష్‌ కొద్ది దూరం కారును నడిపాడు, కానీ పక్కనే ఉన్నవారు అతన్ని వెంబడించి పట్టుకుని గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ అప్పగించారు. తిరుచెంగోడ్‌ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement