యూరియా.. ఇక సులువయా
ఎన్నిసార్లు బుక్ చేసుకోవచ్చు
(15 రోజుల విరామంతో)
తిరుమలగిరి (తుంగతుర్తి): గత సీజన్లో రైతులు యూరియా కోసం నానా పాట్లు పడ్డారు. ఒక్క యూరియా బస్తా దొరికితే చాలు అన్నట్లుగా పరిస్థితి ఉండేది. ఇక నుంచి రైతులకు ఇలాంటి బాధలు లేకుండా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఫర్టిలైజర్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఎక్కడి నుంచైనా యూరియాను బుక్ చేసుకోవచ్చు. కొత్త విధానం ఈనెల 22 నుంచి అమల్లోకి రానుంది. దీనిపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
ఎలా నమోదు చేసుకోవాలంటే..
యాప్ను ఓపెన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకం నంబర్, భూమి లేని కౌలు రైతులైతే ఆధార్ నంబర్ సహాయంతో లాగిన్ కావాలి. అందులో నమోదు చేసే సెల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దాని సహాయంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం పంటల వివరాలు నమోదు చేయాలి. సాగు భూమిని బట్టి ఎన్ని బస్తాల యూరియా రైతుకు ఇవ్వాలో యాప్ చూపిస్తుంది.
ఆన్డ్రాయిల్ ఫోన్లు వాడే వారి సంఖ్య తక్కువ
రైతుల్లో ఆన్డ్రాయిడ్ సెల్ ఫోన్ వాడే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. వీరికి యూరియా ఎలా సరఫరా చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది.
ఎక్కడి వారు అక్కడే..
సాగు భూమి ఉన్న జిల్లా నుంచే బుక్ చేసుకోవాలి. ఒకసారి తీసుకున్నాక మళ్లీ 15 రోజుల వరకు అవకాశం ఉండదు. సమీపంలో ఉండే డీలర్ల పేర్లు కనిపిస్తాయి. అందులో ఒకరిని ఎంపిక చేసుకుంటే 48 గంటల్లోపు బస్తాలు తీసుకోవచ్చు. ఈ సమయం దాటితే మాత్రం రైతు పేరు తొలగి పోతుంది. మరోసారి బుక్ చేసుకోవాల్సిందే. కౌలు రైతులు బుక్ చేసుకుంటే సదరు భూమి యజమాని సెల్ ఫోన్కు ఓటీపీ వస్తుంది.
0–1 ఎకరం వరకు ఒకసారి
1–5 ఎకరాల వరకు 2 సార్లు
5–20 ఎకరాలు 3 సార్లు
20 ఎకరాల పైన 4 సార్లు
వినియోగం ఇలా..
వరి ఎకరాకు 3 బస్తాలు
మొక్కజొన్న ఎకరానికి 4 బస్తాలు
మిగతా వాటికి ఎకరాకు 2 బస్తాలు
ఫ ఆన్లైన్లో బుకింగ్
ఫ అందుబాటులోకి ఫర్టిలైజర్ యాప్
ఫ 22 నుంచి నూతన విధానం అమలు
ఫ అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ


