మొలకెత్తని ఆశలు | - | Sakshi
Sakshi News home page

మొలకెత్తని ఆశలు

Jun 27 2025 12:34 PM | Updated on Jun 27 2025 12:34 PM

మొలకె

మొలకెత్తని ఆశలు

విత్తనాలు మళ్లీ పెడుతున్నాం

ఈసారి 20 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి గింజలు నాటాం. రూ.3.20 లక్షలు ఖర్చు చేశాం. వర్షాభావ పరిస్థితులతో పత్తి గింజలు మొలవ లేదు. ఎక్కడో ఒక చోట కొన్ని గింజలు మొలిచినా ఎండ వేడికి వాడి పోయాయి. రూ.30 వేలతో మళ్లీ పత్తి గింజలు తెచ్చి 9 ఎకరాలలో మళ్లీ విత్తుతున్నాం.

–గుగులోతు కవిత,

నెల్లిబండతండా, తిరుమలగిరి మండలం

విత్తనాలు మొలకెత్తలేదు

ఈనెల మొదట్లో వర్షాలు పడ్డాయి. మాకున్న 15 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశాం. పదును సరిపడలేకపోవడంతో విత్తనాలు సగానికి పైగా మొలకెత్తలేదు. వర్షం కోసం ఎదురుచూస్తున్నాం. మరో పది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది.

– పిట్టల సైదులు,

జాన్‌పహాడ్‌, పాలకవీడు మండలం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తొలకరి వర్షంతో విత్తనాలు వేసిన రైతుల ఆశలు ఆడియాశలయ్యాయి. వర్షకాలం ప్రారంభమై 25 రోజులు గడుస్తున్నా వరుణుడు కరుణించక అన్నదాత ఆందోళనలో పడ్డాడు. ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల్లో తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. పత్తి, మక్క తదితర మెట్ట పంటల విత్తనాలు నాటినా వర్షాల్లేక మొలకత్తలేదు. అక్కడక్కడా మొలకెత్తినవి ఎండిపోతున్నాయి. దీంతో రైతులు వాటిని కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. బిందెలతో నీళ్లు పోస్తున్నా ప్రయోజనం లేకుండాపోయింది. మొదట్లో కాస్త ఊరించిన వరుణుడు నెల రోజులుగా ముఖం చాటేయడంతో రైతన్న వర్షాల కోసం ఆకాశంవైపు చూస్తున్నాడు.

తీవ్ర వర్షాభావ పరిస్థితులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వివిధ మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం, కనగల్‌, పెద్దపూర తదితర మండలాల్లో సుమారు 70 నుంచి 100 శాతం వరకు వర్షపాతం లోటు ఉంది. మిగితా మండలాల్లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో కేవలం 0.3 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది..అంటే ఒక్క తుంపర కూడా లేదు. చింతలపాలెం, నేరేడుచర్ల, పెన్‌పహాడ్‌, చివ్వెంల మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట, అడ్డగూడూరు, భువనగిరి తదితర మండలాల్లోనూ వర్షాభావ పరిస్థితుల నెలకొన్నాయి.

మొదట్లో ఊరించిన వానలు

ఈ నెల మొదట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నైరుతి రుతు పవనాల ప్రభావంతో కొద్దిపాటి జల్లులు పడటంతో రైతులు ఆనందంతో పత్తి విత్తనాలు విత్తారు. ఆ తరువాత నుంచి మళ్లీ వర్షాలు పెద్దక పడకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా కొద్ది రోజులు ఇలాగే ఉంటే పెట్టిన పెట్టుబడి మొత్తం పోవడంతోపాటు మళ్లీ అదనంగా విత్తనాలకు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈఫొటోలో కన్పిస్తున్న రైతు పేరు పేర్ల రామయ్య. సొంతూరు చివ్వెంల మండలం వట్టిఖమ్మం పహాడ్‌. ఈ రైతు తనకున్న మూడెకరాలతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. మొత్తం 13 ఎకరాల్లో దాదాపు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టి పత్తి గింజలు వేశాడు. విత్తనాలు నాటిన నాటి నుంచి ఇప్పటివరకు వర్షం లేక పోవడంతో మొలకెత్తలేదు. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపిండచం లేదు. ఇది జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులందరి పరిస్థితికి నిదర్శనం.

పత్తి విత్తనాలు మొలకెత్తక రైతుల ఆందోళన

ఫ మొలకెత్తిన చోట వర్షాలు లేక

వాడుబడుతున్నయ్‌

ఫ కాపాడుకునేందుకు నానాపాట్లు

ఫ వానల కోసం ఆకాశంవైపు ఎదురు చూస్తున్న రైతాంగం

మొలకెత్తని ఆశలు1
1/4

మొలకెత్తని ఆశలు

మొలకెత్తని ఆశలు2
2/4

మొలకెత్తని ఆశలు

మొలకెత్తని ఆశలు3
3/4

మొలకెత్తని ఆశలు

మొలకెత్తని ఆశలు4
4/4

మొలకెత్తని ఆశలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement