
ఆరుగురు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి
సూర్యాపేటటౌన్ : జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న ఆరుగురు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి లభించింది. ఎస్ఐలుగా ప్రమోషన్ పొందిన వారిలో బి.రామచందర్, హనుమాన్, వి.వెంకన్న , జి.చినమల్సూర్, పి.ముత్తయ్య, ఎస్కె.రహీమొద్దీన్ ఉన్నారు. పదోన్నతి పొందిన వారు గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ వారికి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగోన్నతితో పాటుగా బాధ్యతలు పెరుగుతాయని, అందుకనుగుణంగా విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలన్నారు. పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని కోరారు.
మల్టీపర్పస్ సొసైటీలుగా అభివృద్ధి చేయాలి
చిలుకూరు: పీఏసీఎస్లను మల్టీపర్పస్ సొసైటీలుగా అభివృద్ధి చేయాలని నల్లగొండ డీసీసీబీ ఏజీఎం పసుపులేటి వెంకటేశ్వర్లు సూచించారు. డెవలపింగ్ పీఏసీఎస్ ఇన్టూ మల్టీపర్పస్ సొసైటీ కార్యక్రమంలో భాగంగా గురువారం చిలుకూరు పీఏసీఎస్ను ఫ్యాకల్టీ సభ్యులతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో 40 పీఏసీఎస్లను డెవలపింగ్ మల్టీపర్పస్ సొసైటీలుగా ఎంపిక చేశామని తెలిపారు. జిల్లాలోనే ఆదర్శవంతమైనది చిలుకూరు పీఏసీఎస్ అని కొనియాడారు. అనంతరం డెవలపింగ్ పీఏసీఎస్ ఇన్టూ మల్టీపర్పస్ సొసైటీపై సిబ్బందికి ఫ్యాకల్టీ సభ్యులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీ సభ్యులు విజయశేఖర్, సంపత్కుమార్, డీసీసీబీ డైరెక్టర్ కొండా సైదయ్య, చిలుకూరు ప్యాక్స్ చైర్మన్ అలసకాని జనార్దన్, సెక్షన్ మేనేజర్ అశోక్, కోదాడ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ రామకృష్ణ, సీఈఓ చిలువేరు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఐక్యంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకుందాం
సూర్యాపేట టౌన్: క్రైస్తవులంతా ఐక్యంగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకుందామని జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు మీసాల గోవర్దన్ పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని గ్రేస్ టెంపుల్లో ఏర్పాటు చేసిన జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రైస్తవు సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు. ఈ సందర్భంగా క్రైస్తవ సమాజానికి సేవలందించిన దళిత సంఘం జాతీయ నాయకుడు గుద్దేటి ఎల్లయ్య మాదిగను సన్మానించారు. అనంతరం ఆయన వైద్య ఖర్చులకోసం ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షుడు కాసర్ల శ్రవణ్ కుమార్, చీఫ్ అడ్వైజర్ కొత్తపల్లి సిల్వి, కమిటీ వైస్ ప్రెసిడెంట్ రెమిడాల ప్రకాష్, ప్రధాన కార్యదర్శి కాపర్తి సైమన్, కోశాధికారి పూజర్ల శామ్యూల్, కిరణ్, చంద్రశేఖర్ ,జలగం డేవిడ్ రాజ్, కరుణాకర్, రామారావు, జాషువా పాల్గొన్నారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిత్యకల్యాణం నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యఅగ్నిహోత్రి, పంచామృతాభిషేకం, నూతన పట్టు వస్త్రాలంకరణ చేశారు. అనంతరం ఎదుర్కోళ్లమహోత్సవ నిర్వహించారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలతో నిత్యకల్యాణతంతు ముగించారు. కార్యక్రమంలో విజయ్కుమార్, మట్టపల్లిరావు, నవీన్కుమార్, రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.

ఆరుగురు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి

ఆరుగురు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి