ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపాలి | - | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపాలి

Jun 24 2025 3:22 AM | Updated on Jun 24 2025 3:22 AM

ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపాలి

ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపాలి

సూర్యాపేట అర్బన్‌ : ఇరాన్‌పై అమెరికన్‌ సామ్రాజ్యవాదులు చేస్తున్న యుద్ధ దాడిని ఆపాలని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌ లైన్‌ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్‌ డిమాండ్‌ చేశారు. ఇరాన్‌పై అమెరిక, ఇజ్రాయిల్‌ దాడులకు వ్యతిరేకంగా సోమవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ వద్ద సీపీఐ(ఎంఎల్‌) మాస్‌ లైన్‌ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్‌) మాస్‌ లైన్‌ పార్టీ జిల్లా నాయకుడు కారింగుల వెంకన్న, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్‌ కుమార్‌, నాయకులు పేర్ల నాగయ్య, సూరం రేణుక, ఎస్‌కె.సయ్యద్‌, ఐతరాజు వెంకన్న, శేషగిరి, ఐతరాజు పద్మ, కల్పన, పజ్జూరి రేణుక, అరుణ, పీవైఎల్‌ నాయకులు కట్ట రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement